జమ్ము కశ్మీర్లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ యుద్దానికి దిగదని, ఒకవేళ యుద్దానికి భారత్ సై అంటే ఆ దేశానికే నష్టమని భారత్ ను ఎత్తిపోడుస్తున్న ఘటనలు ఒక వైపు చేస్తూనే,, మరోవైపు తాము యుద్దానికి సిద్దమంటూ సంకేతాలను పంపుతుంది దాయాధి దేశం పాకిస్థాన్. భారత్ భూభాగంలోని కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐక్యరాజ్య సమితిలో మొసలి కన్నీరు కార్చిన పాకిస్థాన్.. తమ దేశంలో ఊహ కూడా తెలియని చిన్నారులకు చేతుల్లో ఏకే 47 లాంటి అత్యంత ప్రమాదకరమైన తుపాకులు ఎలా వస్తున్నాయో మాత్రం తెలియడం లేదు.
చిన్నపిల్లల్లో కూడా విషాన్ని నింపుతూ పాకిస్థాన్ తన యుద్ధకాంక్షను బయటపెట్టుకుంటోంది. అయితే ఇలాంటి ఘటనలపై మాత్రం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కానీ, ఆయన ప్రభుత్వం కానీ నోరు పెదపదు. అంతర్జాతీయ బాలల హక్కుల సంఘాలు కూడా కిమ్మనకుండా వుండటం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. నిజానికి ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండించగా, పాక్ సమాధానం చెప్పుకోలేని స్థితిలో నిలిచింది. ఇక భారత్లో అన్ని పార్టీల నాయకులు, మేధావులు, సెలెబ్రిటీలు, సామాన్యులు పాక్పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రకు చెందిన ఎంఎన్ఎస్ అయితే పాక్కు చెందిన నటీనటులందరూ 48 గంటల్లో దేశం విడిచిపోవాలని అల్టిమేటం జారీచేసింది.
పాకిస్థాన్లో భారత్ పట్ల విషం చిమ్ముతున్నారు. పాక్కు చెందిన ఓ చిన్నారి బాలిక ఏకే 47 గన్ పట్టుకుని భారత్కు, ప్రధాని నరేంద్ర మోదీకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఓ చిన్నమ్మాయి తన తండ్రి పక్కన కూర్చుని ఏకే 47 గన్ పట్టుకుని ఉంది. ఈ పాప మాట్లాడిన భాష సరిగా అర్థం కాదు. అయితే పాప వేలు చూపిస్తూ భారత్ను, మోదీని హెచ్చరిస్తున్నట్టుగా మాట్లాడింది. హెచ్చరికగా ఏకే 47 పేల్చింది. గన్ ఎలా పేల్చాలో ఆ పాప తండ్రి నేర్పించాడు. వీరి వివరాలు తెలియవు కానీ ఈ వీడియోను వేలాది మంది చూస్తున్నారు. భారతీయులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more