ఒక్క ఓటు ప్రభుత్వాన్ని మారుస్తుందని మనకు అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు తెలిసింది. ఒక్క ఓటు గెలుపోటములను నిర్ధేశించగలదని తెలుసు. ఒక్క మార్కు విలువ ఉత్తీర్ణీత మార్కులను సాధించే ప్రతీ విద్యార్థికీ తెలుసు. ఒక్క మార్కుతో ఉద్యోగం అందని ద్రాక్షాగా మారిన నిరుద్యోగికీ దాని విలువ తెలుసు. కానీ ఒక్క రూపాయి విలువ ఎంతో తెలుసా..? ప్రస్తుతం రూపాయి విలువ ఎంతా అని అడుగుతున్నారు కూడానా..? గుడి దెగ్గరో.. లేక విధుల్లోనో తారపడిన యాచకులను చూసి.. ఆదే రూపాయిని ఇస్తే.. వద్దు బాబు మీదెగ్గరే వుండనీయండీ.. ఐదో పది ఇస్తే తీసుకుంటాం అంటున్నారు. అలా తయారైంది రూపాయి విలువ.
కానీ నిజంగా రూపాయిని కష్టపడి సంపాదించిన వారు మాత్రం తమదైన ఒక్క రూపాయిని కూడా వదులుకోలేరు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ జరిగింది. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావని అడిగితే.. ఒకప్పుడు మాత్రం అన్నదమ్ముల మధ్య తగువు పెడతా అంటూ సినీ కవులు గేయాలు కూడా రచించారు. కానీ కండక్టరుకు, ప్రయాణికురాలికి మద్య చిచ్చు పెడతానని మాత్రం ఎవరైరా ఉహించగలరా..? యాజమాన్యానికి కార్మికులకు మధ్య అగాధాన్ని తయారు చేయగలదని, ఉద్యోగినికి విధులను దూరం చేయగలదని ఎవరూ ఊహించివుండరు. కానీ అచ్చంగా అలాంటిదే జరిగింది.
ప్రయాణికులకు, కండక్టర్కు ఒక్క రూపాయి చిల్లర విషయంలో జరిగిన వివాదంతో జంట నగరాల్లో దాదాపు సగం సిటీబస్సులు నిలిచిపోయాయి. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల కార్మికులు సమ్మె చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఉప్పల్ డిపో పరిధిలో పనిచేసే రత్నకుమారి అనే కండక్టర్కు, ఒక ప్రయాణికురాలికి గొడవ జరిగింది. సదరు ప్రయాణికురాలికి ఒక రూపాయి చిల్లర ఇవ్వాల్సి ఉండగా, కండక్టర్ వద్ద చిల్లర లేదని.. దానిపై ఇద్దరికీ మాట మాట పెరగడంతో ప్రయాణికురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు.
దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు రత్నకుమారిని సస్పెండ్ చేశారని.. అందుకు నిరసనగా హైదరాబాద్ రీజియన్ పరిధిలోని పలు డిపోలకు చెందిన కార్మికులు సమ్మె చేస్తున్నారని కొందరు ఆర్టీసీ కార్మికులు చెప్పారు. ఉదయం నుంచి బస్సులు తక్కువగా తిరగడం, షేర్ ఆటోల మీదే ఆధారపడాల్సి రావడంతో అసలు ఏంజరిగిందో కూడా సామాన్య ప్రజలకు చాలాసేపటి వరకు తెలియలేదు. ఉన్నట్టుండి బస్సులు నిలిచిపోవడంతో ఉదయం కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more