యావత్ దేశాన్ని స్వచ్చా భారత్ నినాదంలో దుర్గంధ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలపై పన్ను భారం మోపీ మరీ చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదని ఏకంగా ఉద్యమానికే పూనుకుంటున్నారు అక్కడి ప్రజలు. దేశం సంగతి కాదు కానీ ముందుగా తమ రాష్ట్రంలో దుర్ఘంధపూరిత అందాలను ఓక్కసారి వచ్చి చూడండీ మెగాస్టారు సారూ అని కోరుతూ బాలీవుడ్ అగ్రనటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు ప్రధాని నరేంద్రమోడీకి కూడా లేఖలు రాస్తున్నారు. ఇంతకీ వీళ్లు ఏ రాష్ట్ర వాసులు అంటారా..? ఇంకెవరండీ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ కు చెందిన దళితులు.
ఎలా వుందో ఒకోసార పూరితంగా తయారైన గుజరాత్ను సందర్శించేందుకు రావాలంటూ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ను ఆహ్వానించేందుకు ఉనా దళిత్ అత్యాచార్ లాదత్ సమితి(యూడీఏఎల్ఎస్) ఆధ్వర్యంలో దళితులు సిద్ధమయ్యారు. ‘‘కుష్బూ గుజరాత్ కి’’, కుచ్ దిన్ తో గుజారియే గుజరాత్ మే’’ అనే ట్యాగ్ లైన్స్తో ఆ రాష్ట్ర పర్యాటక శాఖను ప్రమోట్ చేస్తున్న బిగ్బీని రాష్ట్రంలోని అసలు దుస్థితిని చూడాల్సిందిగా వేలాది పోస్టు కార్డులు రాసేందుకు ఉద్యుక్తులవుతున్నారు.
ఈనెల 13న నిర్వహించనున్న బహిరంగ సభ అనంతరం వేలాదిమంది దళితులు అమితా బచ్చన్ను గుజరాత్కు ఆహ్వానిస్తూ లేఖలు రాయనున్నట్టు యూడీఏఎస్ఎస్ కన్వీనర్ జిగ్నేష్ మేవాని పేర్కొన్నారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు బచ్చన్ అందమైన గుజరాత్ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు దళితులను జంతు కళేబరాలను తొలగించేందుకు అడ్డుకుంటుండడంతో రాష్ట్రం కంపుకొడుతోంది. ఆయన(బచ్చన్) ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి గుజరాత్ దుర్గంధాన్ని చూడాలి’’ అని మేవాని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more