అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే తలదాచుకుంటున్నట్లు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందం నిగ్గు తేల్చిన వాస్తవమిది. పాకిస్థాన్లోని ఆరు ప్రాంతాల్లో దావూద్కు ఇళ్లు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి బృందం నిర్థారించింది. ఈమేరకు దావూద్ నివాసాలకు సంబంధించి భారత్ సమర్పించిన 9 చిరునామాల్లో 6 సరైనవేనని ఐరాస ప్రత్యేక బృందం తేల్చింది. మూడు చిరునామాలు మాత్రం తప్పని పేర్కొంది.
యూఎన్ఓ వ్యాఖ్యలతో దావూద్కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూ వస్తోందని భారత్ చేస్తున్న వాదనలకు మరింత బలం చేకూరినట్లైంది. పాకిస్థాన్లో దావూద్ నివాసాలకు సంబంధించి భారత నిఘా సంస్థలు కచ్చితమైన ఆధారాలు సంపాదించాయి. ఆ సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పాకిస్థాన్ విదేశాంగ కార్య దర్శి సర్తాజ్ అజీజ్కు అందచేశారు. అలాగే ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందానికి కూడా ఆ సమాచారాన్ని చేరవేశారు. భారత్ అందించిన ఆధారాలను ప్రత్యేక బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం దావూద్ పాకిస్థాన్లోనే ఉన్నాడని నిర్దారించింది.
కాగా 1993లో ముంబై పేలుళ్లకు దావూద్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అతడు భారత్ నుంచి పరారయ్యాడు. ముంబై నుంచి మకాం ఎత్తేసి విదేశాలకు పారిపోయాడు. కొన్నాళ్లు దుబాయ్లో తలదాచుకున్నాడని, తర్వాత పాకిస్థాన్లోని కరాచీలో నివాసం ఏర్పరచుకున్నాడని, పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అతడికి సహకరిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ కథనాలు వెలువడిన వెంటనే దావూద్ పాకిస్థాన్లోనే ఉన్నాడని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అతడి అప్పగింత కోసం పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారత హోంశాఖ ప్రకటించింది. అయితే, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం అతడు తమ దేశంలో లేనే లేడంటూ ఆ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.
మరోవైపు దావూద్ ఇబ్రహీం భారత్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కూడా ‘బాగా కావాల్సిన’ (మోస్ట్ వాంటెడ్) నేరగాడు. ముంబైలో 1993లో జరిగిన పేలుళ్లకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా, పేలుళ్ల కుట్రలో కీలక పాత్ర పోషించినందుకు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2008లో జరిగిన ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద చర్యల్లో దావూద్ పాత్ర ఉన్నట్లు భారత్, రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more