హరియాణాలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం గ్యాంగ్ రేప్ కు గురైన ఓ దళిత యువతిపై మళ్లీ సామూహిక అత్యాచారం జరిగింది. గతంలో అమెపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులే మరోసారి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. గతంలో అమెపై ఐదుగురు అత్యాచారం చేయగా, ఈ సారి ఏకంగా ఏడుగురు అమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. గతంలో అమె తమపై పెట్టిన గ్యాంగ్ రేప్ కేసును ఉపసంహరించుకోనేందుకు నిందితులు ఒత్తడి తీసుకురాగా, అందుకు అమె అంగీకరించక పోవడంతో ఈ లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి కుటుంబసభ్యులు చెప్పారు.
హర్యానాలోని భివానిలో మూడేళ్ల క్రితం బాధితురాలిపై ఐదుగురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. నిందితులను అరెస్ట్ చేసినా తర్వాత బెయిల్పై బయటకువచ్చారు. కేసును వెనక్కు తీసుకోవాల్సిందిగా నిందితులు బాధిత కుటుంబ సభ్యులను పలుమార్లు బెదిరించారు. బెదిరింపులు యువకులతో పాటు వారి కుటంబపెద్దలు, కులపెద్లల నుంచి కూడా ఎదురవ్వడంతో బాధిత కుటుంబం రోహ్టక్కు మారింది. రోహ్టక్లోని ఓ మహిళా కాలేజీలో బాధితురాలు ఉన్నత విద్యను అభ్యసిస్తుంది.
బాధితురాలిని ఫాలో చేసి అమె కాలేజీ వివరాలను తెలుసుకున్న నిందితులు అమెను అపహరించి మరోమారు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కాలేజీకని వెళ్లిన బాధితురాలు ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు రాత్రి సుఖ్పుర చౌక్ వద్ద బాధితురాలు అపస్మారకస్థితిలో ఉన్నట్టు గుర్తించారు. ఆమె దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులు తనను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more