ప్రత్యేక హైకోర్టు కావాలంటూ తెలంగాణ న్యాయవాదులు రోడెక్కి చేస్తున్న రగడ కేంద్రం దృష్టికి చేరింది. ఇప్పటిదాకా ఉమ్మడి హైకోర్టుతోనే తెలుగు రాష్ట్రాలు నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రా జడ్జిల ఆధిపత్యం ఎక్కువైపోతుందని ఆరోపిస్తూ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనంటూ గత కొద్దిరోజులుగా టీ లాయర్లు నిరసనలు చేస్తున్నారు. రాను రాను ఉద్యమం తీవ్ర రూపం దాల్చటం, జడ్జిలపై వేటు పడుతుండటంతో విషయం కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లింది.
దీంతో న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యవహార శైలి మరో కేజ్రీవాల్ లా ఉందని ఆయన చెప్పారు. హైకోర్టు కోసం ఒక సీఎం అయి ఉండి కేంద్రాన్ని విమర్శించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. హైకోర్టును విభజించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ఇప్పటికే ఇరు రాష్ట్రాల సీఎంలతో తాను చర్చలు జరిపానని ఆయన చెప్పారు.
ఏపీలో హైకోర్టుకు అవసరమైన మౌలిక వసతులు లేకపోగా, తెలంగాణలో మరో ప్రాంతంలో హైకోర్టును నిర్వహించేందుకు టీ సర్కార్ సిద్ధంగా లేకపోవటాన్ని ప్రధాన కారణాలుగా ఆయన వివరించారు. ఈ విషయంలో ముందడుగు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు ఇంకా అనుకూలించలేదని అన్నారు. ఒకవేళ హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు స్థలం చూపిస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని ఆయన వివరించారు. నిజానిజాలు గుర్తించకుండా కేసీఆర్ అండ్ కో తమను విమర్శిస్తున్నారని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన కేసు పెండింగ్ లో ఉండగా, కేంద్రం ఏమీ చేయలేదన్న సంగతి కేసీఆర్ కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తానని కేసీఆర్ మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, కనీసం పదేళ్ల పాటు హైకోర్టు హైదరాబాద్ లో ఉండటానికి అవకాశాలను విభజన చట్టం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలే తప్ప కేజ్రీవాల్ మాదిరిగా, ధర్నాలు, నిరసనలు తెలిపితే తమదేకీ అభ్యంతరం లేదని, దానివల్ల శాంతిభద్రతల సమస్యలు తప్ప మరేమీ ప్రయోజనం ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. తన దృష్టికి వచ్చిన అంశాలను వివరిస్తూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ లకు లేఖ రాస్తానని సదానంద గౌడ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more