రామచిలుకలు మాట్లాడతాయని విన్నాం. చూశాం. కానీ అవే మాటలు నేర్చిన రామచిలుకలు ఇప్పుడు సాక్ష్యాలు కూడా చెబుతున్నాం. అంటే అదేం విడ్డూరం. సెల్ ఫోన్ లలో రికార్డింగు క్లిప్లులుంటేనే చెల్లవని చెప్పే కోర్టులు.. ఏ కేసులోనే పోలీసుల సాక్షాలను అసలు స్వీకరించని న్యాయస్థానాలు రామచిలుక సాక్షాలను తీసుకోవడమేంటని అశ్చర్యపోకండి. అయితే చిలుక జోస్యంతో నేరస్థులు ఎవరన్నది అంచనా వేయవచ్చు. కానీ చిలుక సాక్ష్యంతో అదెలా సాధ్యం.. అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కానీ ఇది నిజం. అమెరికాలోని మిచిగన్లో ఓ హత్య కేసులో రామచిలుక సాక్షిగా నిలిచిలింది.
చిలుక సాక్ష్యంతో కేసును ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. మిచిగన్లోని సాండ్లేక్ పట్టణంలో గత ఏడాది మే నెలలో భర్త మార్టిన్ను హత్య చేసిందనే ఆరోపణలతో గ్లెనా డురమ్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఐదు బుల్లెట్ గాయాలతో వారి నివాసంలో పడి ఉన్న భర్త మార్టిన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గ్లెనా డురమ్ తలకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు పరిస్థితి ఏంటన్నది అర్థం కాలేదు. దీంతో గ్లెనా డురమ్ ఇంటిలోని పెంపుడు చిలుక మాటలు విని వారు ఆశ్చర్యపోయారు.
మార్టిన్ హత్య జరిగిన కొన్ని వారాల తర్వాత ఆ దంపతుల మధ్య చోటుచేసుకున్న గొడవ గురించి చిన్న చిన్న మాటలతో చిలుక అరవడం ప్రారంభించింది. ‘ఇంట్లోంచి బయటకు వెళ్లిపో..’, ‘ఎక్కడికి వెళ్లాలి..’ ‘నన్ను కాల్చొద్దు..’ అనే పదాలను చిలుక చెబుతుండటాన్ని పోలీసులు గమనించారు. చిలుక మాటలను అధ్యయనం చేస్తున్నామని.. హత్య కేసులో చిలుక సాక్ష్యంను కోర్టు అనుమతిస్తుందా? లేదా? అనేది నిర్ధారించాల్సి ఉందని న్యూఎగో కౌంటీ ప్రాసిక్యూటర్ రాబర్ట్ స్ప్రింగ్ స్టెడ్ తెలిపారు. అయితే మరోవైపు తన భర్తను హత్య చేయలేదని గ్లెనా డురమ్ వాదిస్తోంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more