టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలను మౌనంగా చూస్తు ఉండటం తప్పించి ఏం చేయలేని స్థితిలో ఉన్నారు సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు. పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న ఆయన ఎన్నికల్లో ఓటమి తర్వాత స్తబ్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో గవర్నర్ పదవిపై ఆశలు పెంచుకొని భంగపడి, చివరకు రాజ్యసభ సీటైనా వస్తుందని ఎదురు చూస్తున్నారు. అధినాయకత్వం తెలంగాణ పార్టీ శాఖను ఆరో వేలుగా భావిస్తోందని తొటి నేతల దగ్గరే ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ నేతలు టీఆర్ఎస్ లో చేరటం చూసి కంటతడిపెట్టుకున్న ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడుతున్న తనకేం ఒరగడం లేదంటూ బహిరంగంగానే కామెంట్లు చేశారు కూడా. అసలు ఈ నిరాశావాదం వెనుక రాజ్యసభ సీటు దక్కకపోవటం అసలు కారణమని అని తర్వాత తెలిసిందిలేండి.
ఇక ఈసారి వచ్చిన ఛాన్స్ ను అస్సలు మిస్సవ్వకూడదని నిర్ణయించుకున్నారు. 6 రాజ్యసభ స్థానాలలో తెలంగాణ తమ్ముళ్లకు ఒక్క సీటు కూడా ఇవ్వొద్దని అధిష్ఠానం అనుకుంటుండగా, చివరి వరకు ప్రయత్నించి ఎలాగైనా సాధించాలని మోత్కుపల్లి డిసైడ్ అయ్యారు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని పరోక్షంగా ఆయన చంద్రబాబునాయుడినే వేడుకుంటున్నారు. తిరుపతి మహానాడులో వేదికపై ఈ ఐదేళ్లలో తాను పార్టీ కోసం పడిన కష్టాన్ని అధినేతకి వివరించే ప్రయత్నం చేశారు. పార్టీలో కేసీఆర్ ను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో తాను ముందుకు వచ్చి యుద్ధం ప్రకటించానని గుర్తుచేశారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నానని, ఇప్పటికైనా తన కష్టం గుర్తించాలని విజ్నప్తి చేశారు. ఇదే టైంలో తనకు ఆంధ్రా నుంచి సీటు ఇచ్చినా ఫర్వాలేదంటూ హింట్ కూడా ఇచ్చారాయన. ‘‘నాకు ఏ ప్రాంతంతలో సంబంధం లేదు. తెలంగాణ అనుకుంటే తెలంగాణ వాడిని, ఆంధ్రా అనుకుంటే ఆంధ్రావాడిని’’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈసారి కూడా మొండిచేయి చూపిస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా కఠిన నిర్ణయమే తీసుకోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more