ఆనందోత్సాహాలతో భర్తతో కలిసి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ యువతి జీవితం అర్థాంతరంగా ముగిసింది. హైదరాబాద్ కు చెందిన పెందుర్తి రమ్యకృష్ణ ఆత్మహత్యాయత్నం చేసుకుని, రెండు రోజులు కోమాలో ఉండి తుదిశ్వాస విడిచింది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆమె శవాన్ని హైదరాబాద్ కి తీసుకొచ్చిన భర్త మహంత్ ఎయిర్ పోర్ట్ లోనే వదిలేసి తర్వాతి ఫ్లైట్ లోనే తిరిగి వెళ్లిపోయాడు. దీంతో అసలు ఇది ఆత్మహత్యా లేక హత్యా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
అసలేం జరిగింది...
హైదరాబాదులోని కూకట్ పల్లికి చెందిన రమ్యకృష్ణకు మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ మహంత్ తో పెళ్లైంది. ఆ సమయంలో కట్నంగా కోటిన్నర విలువ చేసే ఓ బిల్డింగ్ తోపాటు, వ్యాపారం కోసం 50 లక్షల నగదును మహంత్ కు ఇచ్చారు. ఆపై కొత్త జీవితం కోసం రమ్య భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లింది. ఈ లోగా ఏమైందో ఏమో తెలియదు కానీ... రెండు రోజుల క్రితం ఆమె ఆస్ట్రేలియాలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఇండియాకు వెళ్లమంటే తనకు ఇష్టం లేదంటూ గొడవపడి తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందంటూ మహంత్ చెబుతున్నాడంట. ఇక ఆస్ట్రేలియా వైద్యులు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆమె గొంతునొక్కి ఉన్నట్లు, ఆపై రెండు రోజులు కోమాలో ఉండి చనిపోయినట్లు తెలుస్తోంది.
అనుమానాలు...
డబ్బు కోసమే మహంత్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని రమ్య తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రమ్య పాస్ పోర్ట్ తో అటు నుంచే అటే ఉడాయించడం, రమ్య మరణంపై సరైన వివరణ లేకపోవడంతో తమ కుమార్తెది ముమ్మాటికి హత్యేనని చెబుతున్నారు. అంతేకాదు ఆమె పేరిట ఉన్న రెండున్నర కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కోసమే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని ఆమె సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఎలాంటి సూసైడ్ నోట్ దొరక్కపోవటం, కాళ్లు మంచానికి ఆనుకోని ఉండటం దీనిని మరింత బలపరుస్తుందని అతను అంటున్నాడు. అయితే మహంత్ ను అదుపులోకి తీసుకుంటేనే మిగతా విషయాలు బయటికి వస్తాయని, ఇందుకోసం ఆస్ట్రేలియా అధికారుల సహకారం కోరతామని స్థానిక పోలీసులు చెబుతున్నారు. తమ మధ్యే పెరిగిన ఓ అమ్మాయి ఇలా విగతజీవిలా పడి ఉండటం చూసిన పలువురు స్థానికులు కన్నీటిపర్యంతమౌతున్నారు. అన్యాయంగా రమ్యను పొట్టనబెట్టుకున్న మహంత్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more