ఢిల్లీ పోలీసులు మరో పెను విధ్వంస రచన కుట్రను భగ్నం చేశారు. భారత్ దేశ రాజధాని ఢిల్లీ సహా పలు మహానగరాలలో విధ్వంస రచనకు కుట్ర పన్ని దానిన అమలు చేసే లక్ష్యంలో భాగంగా వ్యూహరచన చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 12 మంది అనుమానితులను ఢిల్లీ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రి విస్తృతంగా జరిపిన తనిఖీలలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరి నుంచి పెద్ద ఎత్తున్న పేలుడు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాద కదలికలపై నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీసులుత విస్తృత సోదాలు చేపట్టారు. 12 బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాలతో పాటు పలు పేలుడు పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని నగరంతో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాలలోనూ భారీ విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అప్రమత్తమైన పోలీసులు ప్రముఖ ప్రఖ్యాత స్థలాలు, ప్రభుత్వ కీలక భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముందుగా జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు అనుమానితులను ఢిల్లీలోని గోరఖ్ పూర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, డొంకంతా కదిలింది. వారు వెల్లడించిన వివరాల మేరకు మిగతావారిని పట్టుకున్నారు పోలీసులు. దీంతో దేశంలో ఉగ్రవాద విధ్వంస రచనను పోలీసులు భగ్నంచేశారు. పోలీసుల అదుపులో వున్నవారంతా స్లీపర్ సెల్స్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. జైషే ఉగ్రవాదులు విధ్వంసానికి కుట్రపన్నుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తర్ ప్రధేశ్ సహా పలు రాష్ట్రాలలో పోలీసుల పహారాను కట్టుదిట్టం చేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more