హైదరాబాద్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ మీద పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అసలే ఇది నిజంగా యాక్సిడెంటేనా లేదంటే మర్డరా అనే అనుమానాలతో పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో జరిగిన ఓ యాక్సిడెంట్ లో బిటెక్ ధర్డ్ ఇయర్ విద్యార్థిని దేవి అనే అమ్మాయి మృతి చెందింది. ఆ సమయంలో కారు నడుపుతున్న భరతసింహారెడ్డి బెలూన్ తెరచుకోవటంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు నిమిషాల్లో ఇల్లు చేరతానంటూ తండ్రికి ఫోన్ చేసిన ఆమెను కారులోనే హతమార్చి రోడ్డు ప్రమాదంగా డ్రామా ఆడుతున్నారని దేవి తరుఫు బంధువులు ఆరోపించారు. కారు ఢీకొన్నట్టుగా చెబుతున్న చెట్టు వద్ద గాజుపెంకులు చల్లి, చెట్టును చెక్కి ప్రమాదమనే భ్రమ కల్పిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్ లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతన్న దేవి అనే అమ్మాయి వాల్ల నాన్న నిరంజన్ రెడ్డి. ఆయన బాగా సంపాదించిదన వ్యాపారి. దేవి సామ సుభాష్రెడ్డి కొడుకుభరతసింహారెడ్డితో కలిసి శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్లో ఓ పబ్లో జరిగిన పార్టీకి వెళ్లారు. పార్టీ ముగిశాక మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నలుగురూ జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని భరతసింహారెడ్డి ఇంటికి బయల్దేరారు. అక్కడకు దగ్గర్లోనే దేవి ఇల్లు కూడా ఉండటంతో డ్రాప్ చేసేందుకు బయల్దేరారు. కానీ అంతలోనే యాక్సిడెంట్ జరిగింది అని తెలిసింది. అయితే భరతసిహా రెడ్డి వైపు ఉన్న సేఫ్టీ బెలూన్లు మాత్రమే ఓపెన్ కావడం, కావాలనే చెట్టును నరికినట్లు ఆనవాళ్లు ఉండటంతో పోలీసులు అనుమానంతో విచారిస్తున్నారు. యాక్సిడెంట్ జరిగిన టైంలో కారులో ఎంతమంది ఉన్నారు... మద్యం మత్తులో కారు నడపటంవల్లనే ప్రమాదం జరిగిందా! ఇలా ఎన్నో అనుమానాలు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూడాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more