కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తుండగా.. దీంతో మధ్యతరగతి ప్రజలు తొలిసారిగా నిర్మించుకునే ఇళ్లపై పన్ను రాయితీ పెరగనుంది. అటు ఇవాళ్టి నుంచి త్రైమాసికం వరకు పేదలు, రైతులు, కూలీలు, మహిళలు, వృద్దులు చిన్న స్థాయిలో చేసే పోదుపు పథకాలపై వడ్డీపై మాత్రం కొత పడనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది బడ్జెట్ లో ప్రవేశపెట్టిన రాయితీ ప్రయోజనాలు వీరికి కలసి రానున్నాయి. తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారికి ఇవాళ్టి నుంచి అదనపు పన్ను ప్రయోజనాలను పొందుతారు.
అయితే కొనుగోలు చేస్తున్న ఇంటి విలువ రూ.50 లక్షల లోపు, దానిపై తీసుకున్న రుణం రూ.35 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి ఇంటి కొనుగోలు చేసేవారు రుణ వడ్డీపై రూ.50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనాన్ని పొందే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రతిపాదన ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నది. దీంతో తొలిసారి ఇంటిని కొనుగోలు చేసేవారు మొత్తంగా ఇంటి రుణ వడ్డీపై ఏడాదికి రూ.2.5 లక్షలు మినహాయింపు పొందొచ్చు.
అదే సమయంలో అటు పేద, మద్య తరగతి ప్రజలు అధికంగా చేసే పోదుపు పథకాలపై మాత్రం వడ్డీలో కోతలు పడతున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస పత్ర (కేవీపీ), సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, బాలికా పొదుపు పథకం- సుకన్యా సమృద్ధి యోజనసహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై శుక్రవారం నుంచీ వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. మూడు నెలలకోసారి మార్కెట్ రేటుకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను సవరించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో ఆయా పొదుపు పథకాలపై 1.3 శాతం వరకూ వడ్డీరేటు తగ్గనుంది. ప్రతి త్రైమాసికానికీ... ముందు నెల 15వ తేదీ చిన్న పొదుపులపై రేట్లను సమీక్షిస్తారు.
దీని ప్రకారం జులై నుంచి సెప్టెంబర్ మధ్య అమలయ్యే వడ్డీరేటు జూన్ 15న నిర్ణయమవుతుంది. ఈ వడ్డీ రేట్లకు ప్రాతిపదికగా అంతకు ముదు మూడు నెలల ప్రభుత్వ బాండ్ల రేటును తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి దోహద పడేలా వ్యవస్థను తక్కువ స్థాయి వడ్డీరేటులోకి మార్చాలన్న కేంద్రం లక్ష్యంలో భాగంగా తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర వ్యాధులు, పిల్లల విద్య వంటి తప్పని అవసరాలకైతే పీపీఎఫ్ అకౌంట్ల ముందస్తు ఉపసంహరణలకూ కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే అకౌంట్ ప్రారంభమై ఐదేళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. మొత్తం డిపాజిట్పై చెల్లించే వడ్డీలో ఒకశాతం జరిమానాగా ఉంటుంది.
* కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీ రేటు తగ్గటంతో 100 నెలలకు రెట్టింపు అవుతున్న పొదుపు ఇకపై 110 నెలలకు రెట్టింపవుతుంది.
* తపాలా సేవింగ్స్పై రేటు 4 శాతంగా కొనసాగుతుంది.
* ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్పై వడ్డీ 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది.
* ఐదేళ్ల మంత్లీ ఇన్కమ్ డిపాజిట్లపై కూడా వడ్డీ 8.4 శాతం నుంచి 7.8 శాతానికి దిగింది.
* పోస్టాఫీస్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై లభించిన 8.4 శాతం వడ్డీ ఇకపై ఏడాదికి 7.1 శాతం, రెండేళ్లకు 7.2 శాతం, మూడేళ్లకు 7.4 శాతం వడ్డీ అందుతుంది.
* పోస్టాఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్పై రేటు 8.5 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గింది.
* పోస్టాఫీస్ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్పై రేటు 8.4 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది.
* సుకన్యా సంమృద్ధి యోజనపై వడ్డీని కూడా 9.2 నుంచి 8.6 శాతానికి తగ్గించారు.
* ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కూడా 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more