తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ -2016ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ర్టంపై దశాబ్దాల పాటు వివక్ష కొనసాగిందని తెలిపారు. ప్రజల అనేక ఆశలు, ఆకాంక్షాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపకల్పన చేశామన్నారు. వాస్తవాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బడ్జెట్ ఇదే అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్రం నుండి ఎలాంటి చేయూత లేదని అంటూనే.. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆయన ప్రసంగించారు. వాస్తవాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బడ్జెట్ అని పేర్కొన్నారు. మూడోసారి రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కేంద్రం నుంచి అందిన సాయం కేవలం రూ.450 కోట్లు మాత్రమేనని వెల్లడించారు. ఎఫ్ఆర్బీఎం పెంచినా ఇంకా అమలుకాలేదని వివరించారు. సీఎం కేసీఆర్ పరతీ శాఖ పనితీరును సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రతిశాఖ నుంచి వచ్చే ఆదాయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని వివరించారు. గత రెండేళ్లుగా సరైన వర్షపాతం నమోదుకాలేదని తెలిపారు. స్థూల ఉత్పత్తి 11.67 శాతం నమోందని వెల్లడించారు.
* బడ్జెట్ రూ.1,30,415.87 కోట్లు
* ప్రణాళికా వ్యయం 67,630.73 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.62,785.14 కోట్లు
* రెవెన్యూ మిగులు రూ.3,318 కోట్లు
* ద్రవ్యలోటు అంచనా రూ.23,467.29 కోట్లు
* రుణమాఫీకి 3718 కోట్లు
* పాలమూరు ఎత్తిపోతలకు రూ. 7,861 కోట్లు.
* నీటి పారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు
* సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 1,150 కోట్లు
* కాలేశ్వరం ఎత్తిపోతలకు రూ. 6,286 కోట్లు
* స్థూల ఉత్పత్తి 11.47 శాతంగా నమోదు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more