ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన ప్రభుత్వానికి మళ్లీ కలవరం మొదలైంది. పైపైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన మాత్రం ఆయన ప్రభుత్వం కలవరపాటుకు గురవుతుంది. ఇటీవలే కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను విరమింపజేసి.. మళ్లీ తమ డిమాండ్లను నెరవేరుస్తామని హామీలు గుప్పించి.. మళ్లీ మళ్లీ మోసం చేయడాన్ని తప్పుబట్టిన కాపులు తూర్పారబడుతున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఈ నెల 10వ తేదీ నుంచి మరోమారు దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించడంతో ప్రభుత్వంలో కలవరం పుడుతోంది. ముద్రగడ తన తాజా ప్రకటనతో వణుకు పుడుతుంది.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ... ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను ఈ నెల 10 తేదీ లోపు తీర్చాలని.. ఈ డెడ్ లైన్ లోపు తీర్చని పక్షంలో ఈ నెల 11 నుంచి మళ్లీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించమని అడగటం తప్పా?, మా సమస్యలను పరిష్కరించమని అడగటం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. కులపోరాటాలను అణచివేస్తామని ప్రభుత్వం చెబుతుండటం ఎంత వరకు సబబు అని ఆయన అన్నారు.
కాపు కులస్తులకు ఇస్తున్న నలభై వేల రూపాయలతో ఏ వ్యాపారం చేయాలో చంద్రబాబు చెప్పాలని... తమ కులస్తులకు ఇస్తున్నఆ డబ్బులు, బాబు కొడుకు చెప్పుల ఖరీదు కూడా చేయవని కాపునేత ముద్రగడ వ్యాఖ్యానించారు. దరిద్రంలో ఉన్నాము.. దాని నుంచి బయటపడేయండి... కొంచెం అన్నం పెట్టండి అని అడిగితే చంద్రబాబు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ లోన్ పెట్టి తమ జాతిని అవమానిస్తున్నారని, కనీసం పదిలక్షల రూపాయలు ఇచ్చినా కూడా దరిద్రం నుంచి బయటపడలేని పరిస్థితుల్లో కాపు కులస్తులు ఉన్నారని ముద్రగడ అన్నారు.
‘నేను రాసిన లేఖను జగన్ చెబితే రాశానని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. అంటే, లేఖ రాసే పరిజ్ఞానం కూడా నాకు లేదా?’ అని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. మాటమాట్లాడితే జగన్ చెప్పినట్లు తాను నడుచుకుంటున్నానని, లేఖ రాశానని బాబు అనడం ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. ‘ఒకళ్ల మోచేతి కింద నీళ్లు తాగి నేను బతుకుతున్నానా?’ అంటూ ఆయన మండిపడ్డారు. ‘ఒక్క విషయం ముఖ్యమంత్రి గారూ..జగన్ గారి వయస్సు నా రాజకీయ జీవితమంత లేదన్నారు.
చంద్రబాబుతో సమంగా తాను ఎన్నిక కాబడ్డానని.. మీ సంగతి జగన్ కు ఎం తెలుసు ... నాకు తెలుసు అని అన్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం తన ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారని అరోపించారు. తనతో జగన్ మాట్లాడారని చంద్రబాబు గానీ, ఆయన ప్రభుత్వం కాని రుజువు చేయమని ఛాలెంజ్ చేశారు. తన ఉద్యమం వెనుక, ఉత్తరాల వెనుక, తన బ్రతుకు దెరువు వెనుక.. జగన్ పాత్ర ఉందని రుజువు చేస్తే అదే రోజు నుంచి ఉద్యమాన్ని వదిలేస్తానని, అంతేకాదు తన కుటుంబం కూడా రాజకీయాల్లో ఉండదని సవాల్ చేశారు. అలా చేయనిపక్షంలో మీరూ, మీ కుటుంబం రాజకీయాల నుంచి విరమించడానికి సిద్దమా అని ఛాలెంజ్ చేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more