బంధువులా వచ్చిన వాడు తన పాటిట రాబంధువై.. తన మానప్రాణాలను హరించాలని యత్నించడంతో.. అపరకాళీలా మారిన ఆ వివాహిత అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పైశాచిక మృగంలా మారిన అతని మర్మాంగాన్ని కోసి కసి తీర్చుకుంది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లా మణిపూర్ ప్రాంతానికి చెందిన దంపతుల ఇంటికీ గత నెల 28న రాంకరణ్ ప్రజాపతి అనే దూరపు బంధువు వచ్చాడు. అతడికి అతిథి మర్యాధలు చేసిన వారు.. స్థానికంగా జరుగుతున్న ఓ జాతరకు కూడా తీసుకునిపోయి చూపించారు.
తన బంధువుపై కన్నేసిన రాంకరణ్.. అమెను బలవంతంగానైనా సొంతం చేసుకోవాలన్న యోచనతో ముందస్తు ప్రణాళిక రచించుకున్నాడు. జాతర నుంచి తిరుగు పయనంలో రమారమి ఇంటికి చేరుకున్న తరువాత.. అమె భర్తను మధ్యం తీసుకురావాల్సిందిగా పంపించాడు. అదే అదనుగా భావించిన అతను వివాహితపై అత్యాచారానికి తెగబడ్డాడు. అమె తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసింది. అ క్రమంలో ఆమెను ఇష్టానుసారంగా చితకబాదాడు కూడా. అయినా అమె అతని భారి నుంచి ఎలాగోలా తప్పించుకుని వంట గదిలోకి వెళ్లింది.
అక్కడ కూరగాయలు కోసే కత్తి కనిపంచగానే.. ఆమె దానిని అందుకుని తనపై దూసుకువస్తున్న మగమృగం జననాంగనాన్ని కోసివేసింది. తీవ్ర రక్తస్రావం కలుగుతుండటంతో వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చిన రాంకరణ్ స్థానిక అస్పత్రికి చికిత్స నిమిత్తం పరుగెత్తుకెళ్లాడు. కాగా పోలిసు పిర్యాదు లేనిదే తాము వైద్యం చేయలేమని అక్కడి వైద్యులు తేల్చిచెప్పడంతో.. హుటాహుటిన బాధితుడు పోలిస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసి అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లాడు. అయితే బాధితుడి ఇచ్చిన పిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ తరువాత దర్యాప్తులో తమకు తెలసిన విషయాలను చార్జిషీటులో నమోదు చేస్తామని స్టేషన్ ఇంచార్జ్ శివ్ కుమార్ మిశ్రా చెప్పారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more