పరీక్ష అంటే అందరికి భయమ.. అయితే బీహార్ లో జరిగిన ఓ ఆర్మీ పరీక్ష మాత్రం నిజంగా భయపెట్టింది. అంతకు ముందు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారని.. ఏకంగా బట్టలు లేకుండా పరీక్షలు రాయించారు అధికారులు. బీహార్లోని ముజఫర్పూర్లో ఆర్మీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు వెళ్లిన విద్యార్థులను ఆర్మీ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో దుస్తులు విప్పేసి రావాలని ఆదేశించారు. దీంతో 1,100 విద్యార్థులు ఏమి చేసేది లేక ఒక్క డ్రాయర్ తప్ప మిగిలిన దుస్తులను తొలగించారు. ఆ తర్వాత పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఏదో రూమ్లో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తారు అనుకుంటే అది కూడా లేదు. పెద్ద గ్రౌండ్లో ఎండలో కూర్చోబెట్టి రాయించారు. కనీసం పరీక్ష రాసేందుకు ప్యాడ్స్ను కూడా తీసుకెళ్లనీయలేదు.
తమ తొడలపై ప్రశ్నాపత్రాన్ని పెట్టుకుని పరీక్ష రాయాలని అధికారులు ఆదేశించారు. తప్పని పరిస్థితుల్లో ఆర్మీ అధికారుల మాట విద్యార్థులు వినాల్సి వచ్చింది. ఆర్మీ అధికారులు ఇలా ఎందుకు చేశారంటే.. గత అనుభావాల దృష్ట్యా మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు దుస్తులు తొలగించిన తర్వాతే పరీక్షలకు అనుమతించామని అధికారులు తెలిపారు. గతేడాది పది పరీక్షల సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు భారీగా వారికి చిట్టీలు అందించిన విషయం విదితమే. ఆర్మీ అధికారులు ఇలా చేయడంతో బీహార్లో విమర్శలు వెలువెత్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more