ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకుండా.. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని మాధవి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి మరీ సూసైట్ చేసుకుంది. ఇంట్లోని ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
స్థానికి కో ఆపరేటివ్ కాలనీలకి చెందిన వీర మాధవి అనే మహిళ ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్ పనిచేస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మాధవి ఆత్మహత్యపై అనుమానం వచ్చిన ఆమె తల్లి శాంతమ్మ సోమవారం రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే మాధవి ఆత్మహత్య చేసుకునే ముందు తన మొబైల్ లో కొన్ని మాటలను రికార్డ్ చేసింది.
అవి ఏమిటంటే... భానుతేజా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసావు. నీ వల్ల నేను నరకాన్ని చూసాను. నీకు దూరంగా వెళ్తున్నాను. నేను దూరంగా వెళ్లడమే నీకు కావాలి కదా. అయితే నాకు చివరి కోరిక ఒకటి వుంది. నువ్వు నాకు గాజులు తొడగాలి. బొట్టు పెట్టాలి. అక్కా(జానకి) నువ్వు నన్ను క్షమించాలి అంటూ వీడియో రికార్డ్ చేసుకొని మాధవి ఆత్మహత్యకు పాల్పడింది.
భానుతేజ నెల్లూరులోని ఓ బంగారు దుకాణంలో పనిచేస్తుండగా మాధవికి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, అతనితో కొంతకాలం ప్రేమ సాగించింది. తన జీవితాన్ని అంతా సమర్పించింది. ప్రేమించుకుంటున్న సమయంలో మాధవి తల్లి శాంతమ్మ పేరు మీద వున్న పొలం, ఇళ్లు రాసివ్వాలని కోరాడు ప్రియుడు. ఈ ఆస్తులను తన పేరు మీద రాయించుకోవాలని కోరాడు. ఈ విషయాన్ని మాధవి తన తల్లిని అడిగినప్పటికీ.. పెళ్లి అయిన తర్వాత రాసిస్తాను అని చెప్పింది. అందుకు ప్రియుడు ఒప్పుకోలేదు. ఈ విషయంలో మనస్థాపానికి గురైన మాధవి... తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మాధవి మరణానంతరం ఆ వీడియోను తన అక్క జానకి పరిశీలించగా ఈ విషయాలన్ని వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మాధవి తల్లి శాంతమ్మ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మృతదేహానికి ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more