జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ వాతావరణం అంతకంతకు వేడెక్కుతోంది. అన్ని పార్టీలు కూడా ఓటర్లను ఆకర్షించేందు రకరకాల ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రచారంలో దూసుకెళుతున్న టీఆర్ఎస్ పార్టీ తాజాగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేసింది. టీఆర్ఎస్ భవన్ లో మంత్రి కేటీఆర్, సీనియర్ నాయకులు కెకె, డి.శ్రీనివాస్ లు ఈ మేనిఫెస్టేను విడుదల చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వం చేసిందే.. చెబుతున్నామని.. మేనిఫెస్టోలో చెప్పినదాని కంటే ఎక్కువే చేస్తామని కేటీఆర్ తెలిపారు.
టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు...
* ఘట్కేసర్, శామీర్పేట రోడ్ నిర్మాణంతో ఈ ఏడాది చివరికి 158 కి.మీ. ఔటర్ రింగ్రోడ్డు పూర్తి
* మూసీనదిపై తూర్పు నుంచి పడమర దిశగా 42 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్
* దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం
* నిరంతర విద్యుత్ సరఫరాకు భరోసా
* 3,500 కిలోమీటర్ల మురుగునీటి కాల్వను ఆధునీకరణ
* ఎంఎంటీఎస్ రెండోదశ పనులు త్వరలో పూర్తిచేస్తామని హామీ
* హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల కొనుగోలు
* ఉస్మాన్ సాగర్-హిమాయత్ సాగర్ల పునరుద్ధరణ
* మూసీ సుందరీకరణ, పునరుద్ధరణకు ప్రాధాన్యత
* ఉచిత వైఫై, రూ. 130 కోట్లతో 200 మార్కెట్లు
* ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో సైక్లింగ్ ప్యాడ్స్
* మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత
* 13 మురికివాడల్లో 17 చోట్ల డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు ప్రారంభం
* రూ. 5 కే భోజన కేంద్రాలను 200కు పెంపు
* ఉద్యోగ కల్పన, నైపుణ్యాల అభివృద్ధి
* రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతి
* రియల్ ఎస్టేట్ సంస్థలపై విధించే నాలా పన్ను ఎత్తివేత
* ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణకు కఠిన నిబంధనలు
* ప్రభుత్వ బడుల విద్యార్థులకు సన్నబియ్యం నాణ్యత పెంపు
* ప్రభుత్వ విద్యార్థులకు డిజిటల్ తరగతులు
* 50 శాతం సబ్సిడీపై మైనార్టీలకు వెయ్యి ఆటోలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more