టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి ఊపందుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు మరోమారు షాక్ తగిలింది. అధికార టీఆర్ఎస్ లోకి భారీ వలసలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు కారు ఎక్కే అవకాశం కనిపిస్తుంది. ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ లతో కలసి నలుగురు ఎమ్మెల్సీలు కూడా భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. స్వయంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు వారిని క్యాంపు కార్యాలయంలోకి తీసుకెళ్లి.. కేసీఆర్ తో భేటీ ఏర్పాటు చేయించారని కూడా వార్తలు వచ్చాయి.
కాగా ఈ వార్తలను నిజం చేస్తూ.. ఇవాళ టీడీపీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ లు కారు ఎక్కుతున్నట్లు ప్రకటిచారు. మెడలో గులాబి కండువాతో వచ్చిన నేతలు తాము అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రభాకర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడిన సాయన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తనకు ఏనాడూ అన్యాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు. టీడీపీని వీడటం తనకు బాధగానే వుందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నామని....ఆయన తమను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు .సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. పార్టీల కంటే తన నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. సాధారణ ప్రజల కోసం కంటోన్మెంట్ లోని ఆర్మీ రోడ్లను తెరిపించడంలో సీఎం కేసీఆర్ కీలక భూమిక పోషించారన్నారు. ఈ కారణంగానే కేసీఆర్ కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిగా మారాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ లో చేరానని ఆయన ప్రకటించారు.
కాగా తాను కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినా.. తనకు పార్టీలో తగిన గుర్తింపు రావడం లేదని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం పార్టీని సంసిద్దం చేయాలని తాను ఎంతగానో చెప్పినా.. పార్టీ పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఇక తనకు.. తన అనుయాయువులకు కాంగ్రెస్ పార్టీలో మనుగడ కష్టమని భావించి.. బంగారు తెలంగాణ దిశగా కష్టపడి పనిచేస్తున్న కేసీఆర్ నిజాయితీ, నిబద్దతలు నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రభాకర్ తెలిపారు.
. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more