నరేంద్ర మోదీ... భారత ప్రధానిగా, సోషల్ మీడియాలో హీరోగా బాగా పేరు వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మోదీకి యమా క్రేజ్ ఉంది. అందుకే మోదీకి ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాల్లో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో కూడా మోదీ గెలుపులో సోషల్ మీడియా ఎంతో బాగా పని చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వల్లే మోదీకి అంత మెజారిటీ రాగలిగింది అంటే ఎంత సత్తా ఉందో ఊహించండి. అయితే ఇదంతా గతం.. మోదీ మానియా రోజు రోజుకు తగ్గుతోంది. తాజాగా అమెరికా పర్యటనకు సిద్దమైన మోదీకి ఛేదు అనుభవమే ఎదురవుతోంది. అక్కడ ఉంటున్న ఎన్ఆర్ఐలు మోదీకి ఝలక్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే అది కూడా మోదీ ఏ సోషల్ మీడియా ద్వారా అయితే ఫేమస్ అయ్యారో అదే సోషల్ మీడియా ద్వారా వ్యతిరేక ప్రచారం సాగనుంది.
తాజాగా మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఒక ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించారు కొందరు వ్యక్తులు. మోదీఫెయిల్(modifail.com) అనే పేరుతో ఓ సైట్ ను ఏర్పాటు చేసి అందులో మోదీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్లో దళితులు, మైనారిటీలు, మహిళలకు వ్యతిరేకంగా హింస పెరిగిపోయిందని వారు ట్విట్టర్లో విమర్శిస్తున్నారు. పౌర హక్కులు మంటగలుస్తున్నాయని, అకాడమిక్, సాంస్కృతిక సంస్థల్లో మత ఛాందస రాజకీయాలను చొప్పిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయుల ప్రయోజనాల కోసం ఇంతవరకు మోదీ ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శిస్తున్నారు.
భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను, ప్రవాస భారతీయులను ఆహ్వానించేందుకు సిలికాన్ వ్యాలీకి వస్తున్న మోదీని ఆయన ఏడాది పాలన తీరుపై, విజన్పై నిలదీయాల్సిన అవసరం ఉందని ‘న్యాయం, జవాబుదారితనం కోసం కూటమి’గా చెప్పుకుంటున్న సభ్యులు పిలుపునిస్తున్నారు. 27వ తేదీన సిలికాన్ వ్యాలీ వద్ద నిరసన ప్రదర్శన జరుపుతామని వారు ప్రకటించారు. వారి వెనక ఏదైనా రాజకీయ పార్టీ హస్తం ఉందా ? అన్న విషయం మాత్రం స్పష్టం కావడం లేదు. సాన్ జోస్లోని సాప్ సెంటర్లో సెప్టెంబర్ 27వ తేదీన 18,500 మందిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more