భారత – పాక్ విభజనలో కాశ్మీర్ ..ఓ అపరిష్కృత అజెండా.. అని పాక్ ఆర్మీచీఫ్ రహీల్ షరీఫ్ పేర్కొన్నారు. ఉభయ దేశాలమధ్య చిన్న యుద్దమైనా.. లేదా పెద్ద యుద్దమైనా జరిగేది మాత్రం. విధ్వంసమే.. అని పాక్ ఆర్మీచీఫ్ హెచ్చరించారు. కాశ్మీర్ ను భారత్ లో అంతర్గత భాగంగా గుర్తించేందుకు ఇప్పటికీ పాక్ సిద్ధంగా లేదని మరో సారి రుజువు చేశారు. విదేశాల నుంచి దురాక్రమణ ఎదురైతే.. దేశాన్ని అన్నివిధాల రక్షించుకోగల పూర్తి సామర్థ్యం తమ సైనిక దళాలకు ఉందని రావల్పిండిలో జరిగిన ఓ కార్యక్రమంలో జనరల్ షరీఫ్ పేర్కొన్నారు. పరోక్షంగా భారత్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో ఎలాంటి యుద్ధాలు ఎదురైనా మెరుపుదాడులు జరిగినా, భారతదేశం సర్వసన్నద్ధంగా ఉందని భారత సైనికాధిపతి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ గతవారం చేసిన వ్యాఖ్యకు జవాబుగా పాక్ ఆర్మీచీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో పాక్ తరచు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్ లో రోజూ ఏదో అలజడి సృష్టించేందుకు యత్నిస్తోంది. ఇటీవల సరిహద్దుల ఆవలనుంచి పాక్ రేంజర్లు జరిపిన కాల్పులకు ఆరుగురు పౌరులు బలయ్యారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పర్యటించిన భారత ఆర్మీచీఫ్ .. బాధితులు, సైనికుల నుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా యుద్ధం వస్తే.. భారత్ సర్వ సన్నద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్ సైనికులకు ధైర్యం చేప్పే కృషిలో పాక్ ఆర్మీచీఫ్ రావల్పిండిలో ప్రసంగించారు. శతృదేశం ఏమాత్రం దుందుడుకు చర్యలకు దిగినా .. అపరిమితమైన విధ్వంసం తప్పదని హెచ్చరించారు.
సరిహద్దుల్లో పాకిస్తాన్ దుశ్చర్యలు సహించరానివని ఈసారి యుద్ధం వస్తే పాకిస్తాన్ను నాలుగు ముక్కలు చేస్తామని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. భారత్ యుద్ధాన్ని కోరుకోవటంలేదని, అందుకే సయంమనం పాటిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ నిరాశ చెందుతోందని, తన బాధను వ్యక్తం చేస్తోందని అన్నారు. భారత్ను పాక్ ఎదుర్కోలేదని ఆయన అన్నారు. మనం యుద్ధం కోరుకోవడంలేదని, యుద్ధమే గనక వస్తే పాక్కు తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన అన్నారు. గత యుద్ధంలో పాకిస్తాన్ను రెండు ముక్కలు చేశామని, ఈసారి నాలుగు ముక్కలు చేస్తామని సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. మనకు ఆత్మవిశ్వాసం ఉందని, పాకిస్తాన్కు భయం ఉందని ఆయన చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more