మేకిన్ ఇండియా.. స్వచ్ఛ భారత్.. యోగా డే అంటూ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న బారత ప్రధాని నరేంద్ర మోదీ తనలో ఉన్న మరోకోణాన్ని బయటకు తీస్తున్నారు. సూట్ బూట్ వాలా సర్కార్ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అక్షరాల నిజాలుగా అనిపించేలా మోదీ చేస్తున్న ఖర్చు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దుబారా ఖర్చులకు కాంగ్రెస్ వాళ్లు పెట్టింది పేరు కానీ మేము మాత్రం అలా కాదు.. ప్రతి రూపాయికి మేము ఖచ్చితంగా జవాబుదారిగా నిలుస్తాం అంటూ బీరాలు పలికిన మోదీ గారి విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చు చూస్తే మాత్రం నోటిని వేలువేసుకోకుండా ఉండలేరు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారంలో మోదీ గారి ఖర్చు వివరాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు కూడా పలు విమర్శలు చేస్తున్నాయి. మరి మోడీ చేస్తున్న విదేశీ పర్యటనలకు ఖర్చు ఎంతవుతుంది ? ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ? అనే ఆలోచనలు అందరిలో కలుగక మానదు. ఓ వ్యక్తికి కూడా ఇలాగే సందేహాలు వచ్చాయి. దీనితో సమాచార హక్కు చట్టాన్ని వినియోగించాడు. 2014 జూన్ నుండి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో మోడీ చేసిన విదేశీ పర్యటనల మొత్తం ఖర్చులను తెలుపమన్నాడు. అక్షరాల 37 కోట్లు ఖర్చయిందని తేలింది. అగ్రభాగం ఆస్ట్రేలియా పర్యటనకు ఖర్చు పెట్టారని పేర్కొంది. ఏడాది కాలంలో మోడీ మొత్తం 20 దేశాల్లో పర్యటించారని, మొత్తం 37.22 కోట్లు ఖర్చయిందని పేర్కొంది. వీటిలో అత్యధికంగా ఆస్ట్రేలియా, యూఎస్, జర్మనీ, ఫిజీ, చైనా దేశాలకు కాగా భూటాన్ పర్యటనకు మాత్రం 41.33 లక్షలు తక్కువగా ఖర్చయ్యాయని వివరించారు. హోటల్ లో బస ఖర్చు 5.60 కోట్లు అని, అద్దె కార్లకు 2.40 కోట్లు అని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more