భర్తతో కలకాలం సుఖంగా జీవించాల్సిన భార్యలు కలహాలకు కేంద్రబిందువుగా మారుతున్నట్లు కనిపిస్తున్నారు. తమ మోజు తీర్చుకోవడం కోసం పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం.. కుదిరితే అందరిని వదిలేసి వారితో పారిపోవడం లాంటివి చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకోగా.. తాజాగా మరో ఇల్లాలు పరాయి వ్యక్తితో పరారవ్వడం తీవ్రకలకలం సృష్టించింది. దీంతో ఆమె భర్త మరొకరిపై తన ప్రతీకారం తీర్చుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్ బరేలీలోని మీర్ గంజ్ ప్రాంతానికి చెందిన వూరన్ లాల్ అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహం అయ్యింది. కొన్నాళ్లపాటు వీరి దాంపత్యజీవితం సవ్యంగానే కొనసాగింది. అయితే.. ఇంతలోనే ఆ వివాహితకు డోరిలాల్ అనే వ్యక్తితో పరిచయం అయింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లు వీరు తమ అక్రమబంధాన్ని ఎవరికీ తెలియకుండా గుట్టుగానే సాగించారు. వూరన్ లాల్ కి తన భార్య ప్రవర్తనలో మార్పులు గమనించినప్పటికీ.. ఆమె అక్రమబంధాన్ని కనిపెట్టలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ పారిపోవాలని పథకం వేశారు. ప్లాన్ ప్రకారం.. వూరన్ లాల్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య, డోరీలాల్ పారిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న వూరన్ లాల్.. తీవ్ర ఆగ్రహానికి గురై డోరీలాల్ కుటుంబాన్ని బెదిరించాడు. తన భార్యను వెనక్కు తీసుకురాకపోతే విపరీత పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందంటూ చాలాసందర్భాల్లో బెదిరించాడు కూడా! కాలక్రమంలో మరింత కోపాద్రిక్తుడైన వూరన్ లాల్.. తాజాగా డోరీలాల్ అన్నపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వెంటనే వారు పోలీసులకు సంప్రదించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more