రూపాయికి ఏం వస్తుంది? మహా అయితే ఓ చిన్న చాక్లెట్ వస్తుంది. అదే రూపాయికి భోజనం వస్తుందంటే నమ్మగలరా? ఇది నిజం. తమిళనాడులోని ఓ మెస్ యజమాని రూపాయికి అన్నం పెడుతున్నాడు. పేదల కడుపు నింపుతున్నాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి దయామయులున్నారు అనడానికి వెంకట్రామనే ఉదాహరణ. తమిళనాడులోని ఈరోడ్ పట్టణం. ఏఎంవి హోమ్లీ మెస్ యజమాని. అక్కడి ప్రభుత్వా ఆస్పత్రిలోని రోగులతో పాటు వచ్చే సహాయకులకు రూపాయికే భోజనం పెడుతున్నాడు. ఇలా ఏదో ఒక రోజు చేసి ఊరుకోవడం కాదు. గత ఎనిమిదేళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు.
ఎనిమిదేళ్ల క్రితం, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త కోసం ఓ వృద్ధురాలు వెంకట్రామన్ మెస్ కు వచ్చింది. 10 రూపాయలకు మూడు దోసెలు ఇచ్చాడు. ఇది తనకు భారమని, అయినా తప్పడం లేదని ఆమె చెప్పింది. దీంతో వెంకట్రామన్ చలించిపోయాడు. ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగుల గురించి ఆరా తీశాడు. అందరూ పేదలే అని తెలుసుకున్నాడు. వారి సహాయకులకు రూపాయికే భోజనం పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నానని వెంకట్రామన్ చెప్పారు. మొదట్లో రోజుకు 10 మందికి టోకెన్ల ద్వారా రూపాయికే భోజనం పెట్టేవారు.
వెంకట్రామన్, ఆయన భార్య మనస్ఫూర్తిగా ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నారు. టోకెన్ల సంఖ్యను కూడా పెంచారు. రోజూ ఉదయం 10 మంది రోగుల సహాయకులకు టిఫిన్ టోకెన్లు ఇస్తారు. రూపాయికే మూడు దోసెల పార్సిల్ ఇస్తారు. మధ్యాహ్నం 40 మందికి రూపాయికే భోజనం ప్యాకెట్లు ఇస్తారు. సాయంత్రం 20 మందికి రూపాయికే దోసె, చపాతి పార్సిల్ ఇస్తారు. మామూలు కస్టమర్లకు మాత్రం 50కే భోజనం పెడతారు. త్వరలోనే టోకెన్ల సంఖ్యను 100కు పెంచాలని భావిస్తున్నారు. రూపాయికి భోజనం పెట్టడం వల్ల నష్టం వస్తున్నా, మానవతా దృష్టితో కొనసాగిస్తామని వెంకట్రామన్ దంపతులు చెప్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more