ప్రత్యేక హోదా కోసం వైసీపీ తలపెట్టిన ఏపీ బంద్ ముగిసింది. 13 జిల్లాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కన్పించింది.. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. చాలా చోట్ల వాహనాలు తిరగ లేదు.. బంద్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు తలెత్తకుండా పోలీసులు వైసీపీ నేతలను చాలా చోట్ల ముందుస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. . ఇవాళ్టి బంద్ కు వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, పెట్రోల్ బంక్ ల యజమానులు మద్దతు ప్రకటించడంతో బంద్ ప్రభావం మరింతగా కన్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే బసు డిపోల ముందు వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఎక్కడి బస్సులు అక్కడే నిల్చిపోయాయి. అయితే పలు చోట్ల పోలీసుల బందో బస్త్ నడుమ బస్సులను నడిపించే ప్రయత్నం చేశారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రిలలలో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేతల అరెస్టులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ ధర్నాకు దిగడంతో పూర్తి స్థాయిలో బంద్ ప్రభావం కనిపించింది.
ఏపీ వ్యాప్తంగా బంద్ సంపూర్ణం గా ముగిసిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీకి వైసీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక హోదా సాధించడమనేది ప్రధానమని ఆయన చెప్పారు. వామపక్షాలు, ప్రజాసంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బంద్ను అడ్డుకోవాలన్న ప్రభుత్వ చర్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా అంశాలను ప్యాకేజీ కిందకు తీసుకురావడం ఎంతవరకు సమంజసమని బొత్స ప్రకటించారు. హోదా కోసం ఎన్నిరోజులు వేచిచూడాలో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కుయక్తులు మానుకుని ప్రత్యేకహోదాపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని బొత్స అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more