తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఓటుకు నోటు వ్యవహారం కోర్టులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించిన ఏపి సర్కార్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చారు రాంజెఠ్మలాని. రాంజెఠ్మలాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తన వాదనలు వివరిస్తు తెంలగాణ ప్రభుత్వం ట్యాపింగ్ కు పాల్పడింది అని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు దీనిపై తీర్పు ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు తెలంగాణ రాష్ట్రానికి ఉందని వాదించారు రాంజెఠ్మలాని. ఓటుకు నోటు కేసు నమోదైన తర్వాతే తెలంగాణ సర్కారు ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు రాంజెఠ్మలానీ. సర్వీస్ ప్రొవైడర్లకు హోంశాఖ కార్యదర్శి నుంచి లేఖలు రాశామని టీ ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే ఫోన్ ట్యాపింగ్ చేయడం సరికాదన్నారు ఏపీ తరఫున వాదించిన అదనపు సొలిసెటర్ జనరల్ నటరాజన్. దేశ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడే, అసాంఘిక శక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయవచ్చని… దీనికి రాష్ట్ర, కేంద్ర హోంశాఖ కార్యదర్శుల అనుమతి ఉండాలన్నారు నటరాజన్.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు ముందకా..? వెనక్కా..?
సాయంత్రం నాలుగు గంటలకు ఓటుకు నోటు వ్యవహారం మీద కోర్టు తీర్పును వెల్లడించనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారం పై కోర్టులో వాదనలు ముగిశాయి. ఇప్పటికే 39 మంది సాక్షులను విచారించిన తెలంగాణ ఏసీబీ, రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురి మీద ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను మాత్రం చార్జ్ షీట్ లో నమోదు చెయ్యలేదు. అయితే సండ్ర పేరుతో సపరేట్ గా ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు సమాచారం. మరి తెలంగాణ, ఏపిల మధ్య సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన ఓటుకు నోటు వ్యవహారం పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: కాల్ డేటా ఇవ్వని సర్వీసు సంస్థలపై కేసులు నమోదు చేయండి
Also Read: ‘ఫోన్ ట్యాపింగ్’లో అడ్డంగా బుక్కైన కేసీఆర్..?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more