గోదావరి మహా పుష్కరాలు ఎంతో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 25 వరకు సాగనున్న గోదావరి మహా పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి గోదావరి మహా పుష్కరాలు కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కేసీఆర్ ఆదేశించారు. అలాగే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎంతో వైభవంగా పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. అయితే గోదావరి తీరంలో ఎంతో వైభవోపేతంగా సాగుతున్న గోదావరి మహా పుష్కరాలను కెమెరాలో బంధించడానికి చంద్రబాబు వేరే ప్లాన్ వేశారు. ఖర్చు ఎంతైనా గోదావరి పుష్కరాల అనుభూతిని కళ్లకుకట్టేలా పుష్కరాలను డ్యాక్యుమెంటరీ రూపంలో తీయనున్నారు.
Also Read: దారులన్నీ గోదారికే..
నేషనల్ జియోగ్రఫి ఛానల్ తో డాక్యుమెంటరీ...
గోదావరి మహా పుష్కరాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు వాటిని చరిత్రలో గుర్తుండిపయేలా చెయ్యాలని ప్లాన్ వేశారు. అందులో బాగంగానే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వారి చేత గోదావరి మహా పుష్కరాల మీద డాక్యుమెంటరీ తయారు చేయించడానికి సిద్దమయ్యారు. అయితే ముఖ్యంగా పుష్కరాలు జరుగుతన్న రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట వద్ద నేషనల్ జియోగ్రఫీ ఛానల్ సిబ్బంది దృష్టిసారించింది. అందుకే అక్కడ రాత్రి పూట ఏర్పాటు చేసిన లైటింగ్ లో కొన్ని మార్పులు కూడా చేయించారు చంద్రబాబు నాయుడు. ఛానల్ సిబ్బందికి అన్ని రకాల వసతులు కల్పించడమే కాకుండా వారికి కావాలసిన వసతులు కూడా కల్పించాలని ఆదేశించినట్లు సమాచారం.
Also Read: చంద్రబాబు షూటింగ్ వల్లే అంతమంది చనిపోయారు
ఏడు కోట్లతో డాక్యుమెంటరీ..
గోదావరి మహా పుష్కరాలను నేషనల్ జాగ్రఫీ ఛానల్ డాక్యుమెంటరీ చెయ్యడానికి ఏపి ప్రభుత్వం ఒప్పించింది. అయితే అందుకు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం విశేషం. అయితే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న గోదావరి మహా పుష్కరాలను మరిచిపోలేని విధంగా కళ్లముందు కట్టే డాక్యుమెంటరీ కోసం ఏడు కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి అని కొందరు వెనకేసుకు వస్తుంటే.. మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. అయితే రాజమండ్రి దుర్ఘటన తర్వాత చంద్రాబాబు నాయుడు మీడియాలో ప్రచారం కోసం ఇలా డాక్యుమెంటరీ చేయిస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు.
Also Read: చావులకు పరోక్షంగా బాబే కారణం అంటూ కలెక్టర్ నివేదిక..!
నేడు, రేపు భక్తజనుల గోదారే..
రంజాన్, ఆదివారం సెలవులతో గోదావరి మహా పుష్కరాలకు తాకిడి పెరిగింది. అటు ఏపిలో, తెలంగాణలో రద్దీ భారీగా పెరగుతొంది. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల నుండి భక్తులు గోదావరి మహా పుష్కరాలకు క్యు కట్టారు. రెండు రోజులు వరుస పెట్టి సెలవులు రావడంతో ఈ రెండు రోజులు గోదావరి మహా పుష్కరాలకు మరింత శోభరానుంది. అయితే ఈ రెండు రోజులు పుష్కరాలకు హాజరయ్యే భక్తులు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more