Chandrababu naidu | Rajahmundry | Shooting | Boyapati Srinivas | Godavari Pushkaralu, Bostha Satyanarayana

Chandrababu naidu led their lives for shooting

Chandrababu naidu, Rajahmundry, Shooting, Boyapati Srinivas, Godavari Pushkaralu, Bostha Satyanarayana

Chandrababu Naidu led their lives for Shooting. YSRCP leader Bostha Satyanarayana attacked on chandrababau naidu and said that Rajahmundry incident cause by the chandrababu shooting.

చంద్రబాబు షూటింగ్ వల్లే అంతమంది చనిపోయారు

Posted: 07/17/2015 03:42 PM IST
Chandrababu naidu led their lives for shooting

లెక్కకు మించిన జనం.. కంట్రోల్ కాని పరిస్థితి.. ఏమీ చెయ్యలేని అధికారులు.. అంతా కలిసి రాజమండ్రి పుష్కరాల మొదటి రోజు 27 మంది చావులకు కారణం. అయితే రాజమండ్రి దుర్ఘటన సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షం వైసీపీ విమర్శల దాడి కొనసాగిస్తోంది. పుష్కరాలపై బోయపాటి దర్శకత్వంలో చంద్రబాబుపై డ్యాకుమెంటరీ చిత్రీకరణ జరిపారని అందువల్లే పుష్కరాల్లో దుర్ఘటన జరిగిందని వైసీపీ ఆదినుంచి చెబుతోంది. తాజాగా ఆ వాఖ్యలను సమర్థిస్తూ చంద్రబాబును వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యానారాయణ విమర్శించారు. దుర్ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం సరికాదు అని ఆయన అన్నారు.

Also Read:  చావులకు పరోక్షంగా బాబే కారణం అంటూ కలెక్టర్ నివేదిక..!

రాజమండ్రిలో పుష్కరాల మొదటి రోజు జరిగిన ప్రమాదం గురించి అందరికి తెలిసిందే.ఫస్ట్‌లో అందరు ఎక్కువ జనం రావడం వల్ల జరిగింది అనుకున్నారు.కొద్ది సేపటి తరువాత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విఐపీ ఘాట్‌లో కాకుండా సాధరణ ఘాట్‌లో చేయడం వల్ల ఆ ప్రమాదం జరిగిందని ప్రతిపక్ష నాయకులు మిడియా ముందు విరుచుకు పడ్డారు.అనుకోకుండా జరగడమో,అనుకున్నది జరక్కపోవడమో,అదే ఊహించనిది జరగడమో తెలియదుగాని భ్రాంతి చెందిన బాబు మీకేం చేతకాదు అని అధికారుల పై విరుచుకుపడి దగ్గరుండి మరి పుష్కర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.అయితే ఎక్కడ నుంచి లీక్‌ అయిందో గాని,"ఒక డాక్యుమెంటరి షూటింగ్‌ కోసం జనాన్ని కావలని అక్కడకు తరలించారని అందుకే బాబు అన్ని గంటలు పుష్కర ఘాట్‌లో గడిపారు అనే మాట బయటకి వచ్చింది".అయితే అది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే.తాజాగ సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేస్తున్న ఒక ఫోటో చూస్తే అది నిజమేనేమో అనే అనుమానం కలుగుతుంది.

chandrababu-with-boyapati-s

(పుష్కరాలకు వచ్చిన చంద్రబాబు నాయుడు దంపతులు, పక్కన దర్శకుడు బోయపాటి శ్రీను)

Also Read:  చంద్రబాబు కనుసన్నల్లో ఏపి గోదావరి పుష్కరాలు

పైన ఆ ఫోటో చూసారుగా,అది చూసి పోని ఏదో పేరున్న డైరెక్టర్‌ కాబట్టి బాబుగారి తో కలిసి పుష్కర స్నానం చేస్తున్నారు అని సర్థి చెప్పుకుందాం అనుకున్నా..పుష్కర స్నానం చేసే ఆయన మంచిగా రెడి అయి ఎందుకు ఉన్నారు..నీటీలో మునగడానికి వెళ్లినప్పుడు చేతిలో మైక్‌ ఎందుకు.పోనీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు అని అనుకుందామంటే..ఆయనేమి గవర్నమెంట్‌ ఆఫిసర్‌ కాడు కనీసం పార్టీ కార్యకర్త కూడా కాదు.ఇప్పటి వరకు ఏ మచ్చా లేని చంద్రబాబు నాయుడు గారి మచ్చలేని జాబితాలోకి ఇది కూడా చేరుతుంది కావలంటే చూడండి.ఎందుకంటే అసలు విషయం తెలిసి,అంతా దగ్గరుండి మరి చూసిన అధికారులు ప్రమాదం అనుకోకుండా జరిగింది అని చెబుతున్నారు. మరి నిజమేంటో చంద్రబాబుకు, బోయపాటి శీనుకు ఆ గంగమ్మకే తెలియాలి.

By Abhinavachary

Also Read:  దారులన్నీ గోదారికే.. తొలిరోజే 24 లక్షల మంది పుష్కర స్నానం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles