లెక్కకు మించిన జనం.. కంట్రోల్ కాని పరిస్థితి.. ఏమీ చెయ్యలేని అధికారులు.. అంతా కలిసి రాజమండ్రి పుష్కరాల మొదటి రోజు 27 మంది చావులకు కారణం. అయితే రాజమండ్రి దుర్ఘటన సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షం వైసీపీ విమర్శల దాడి కొనసాగిస్తోంది. పుష్కరాలపై బోయపాటి దర్శకత్వంలో చంద్రబాబుపై డ్యాకుమెంటరీ చిత్రీకరణ జరిపారని అందువల్లే పుష్కరాల్లో దుర్ఘటన జరిగిందని వైసీపీ ఆదినుంచి చెబుతోంది. తాజాగా ఆ వాఖ్యలను సమర్థిస్తూ చంద్రబాబును వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యానారాయణ విమర్శించారు. దుర్ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం సరికాదు అని ఆయన అన్నారు.
Also Read: చావులకు పరోక్షంగా బాబే కారణం అంటూ కలెక్టర్ నివేదిక..!
రాజమండ్రిలో పుష్కరాల మొదటి రోజు జరిగిన ప్రమాదం గురించి అందరికి తెలిసిందే.ఫస్ట్లో అందరు ఎక్కువ జనం రావడం వల్ల జరిగింది అనుకున్నారు.కొద్ది సేపటి తరువాత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విఐపీ ఘాట్లో కాకుండా సాధరణ ఘాట్లో చేయడం వల్ల ఆ ప్రమాదం జరిగిందని ప్రతిపక్ష నాయకులు మిడియా ముందు విరుచుకు పడ్డారు.అనుకోకుండా జరగడమో,అనుకున్నది జరక్కపోవడమో,అదే ఊహించనిది జరగడమో తెలియదుగాని భ్రాంతి చెందిన బాబు మీకేం చేతకాదు అని అధికారుల పై విరుచుకుపడి దగ్గరుండి మరి పుష్కర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.అయితే ఎక్కడ నుంచి లీక్ అయిందో గాని,"ఒక డాక్యుమెంటరి షూటింగ్ కోసం జనాన్ని కావలని అక్కడకు తరలించారని అందుకే బాబు అన్ని గంటలు పుష్కర ఘాట్లో గడిపారు అనే మాట బయటకి వచ్చింది".అయితే అది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే.తాజాగ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్న ఒక ఫోటో చూస్తే అది నిజమేనేమో అనే అనుమానం కలుగుతుంది.
(పుష్కరాలకు వచ్చిన చంద్రబాబు నాయుడు దంపతులు, పక్కన దర్శకుడు బోయపాటి శ్రీను)
Also Read: చంద్రబాబు కనుసన్నల్లో ఏపి గోదావరి పుష్కరాలు
పైన ఆ ఫోటో చూసారుగా,అది చూసి పోని ఏదో పేరున్న డైరెక్టర్ కాబట్టి బాబుగారి తో కలిసి పుష్కర స్నానం చేస్తున్నారు అని సర్థి చెప్పుకుందాం అనుకున్నా..పుష్కర స్నానం చేసే ఆయన మంచిగా రెడి అయి ఎందుకు ఉన్నారు..నీటీలో మునగడానికి వెళ్లినప్పుడు చేతిలో మైక్ ఎందుకు.పోనీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు అని అనుకుందామంటే..ఆయనేమి గవర్నమెంట్ ఆఫిసర్ కాడు కనీసం పార్టీ కార్యకర్త కూడా కాదు.ఇప్పటి వరకు ఏ మచ్చా లేని చంద్రబాబు నాయుడు గారి మచ్చలేని జాబితాలోకి ఇది కూడా చేరుతుంది కావలంటే చూడండి.ఎందుకంటే అసలు విషయం తెలిసి,అంతా దగ్గరుండి మరి చూసిన అధికారులు ప్రమాదం అనుకోకుండా జరిగింది అని చెబుతున్నారు. మరి నిజమేంటో చంద్రబాబుకు, బోయపాటి శీనుకు ఆ గంగమ్మకే తెలియాలి.
By Abhinavachary
Also Read: దారులన్నీ గోదారికే.. తొలిరోజే 24 లక్షల మంది పుష్కర స్నానం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more