రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, గ్రామీణ అభివృద్ది శాఖల మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ డోలాయమానంలో పడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన డొక్కా మాణిక్యవరఫ్రసాద్ ఈ నెల 13న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆయన పార్టీ తీర్ఘం పుచ్చుకోవడానికి రమారమి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా చివరి క్షణంలో తాను వైసీపీలో చేరడం లేదని మాణిక్యవరప్రసాద్ చెప్పారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానాలు రావడంతో అంగీకరించానని.. అయితే ప్రస్తుతం నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు.
తాను రాజకీయాల్లో పదకొండేళ్ల బాలుడినని, ఇంకా ఎంతో అధ్యయనం చేయాల్సి ఉందని, ప్రస్తుతం నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలకు తాను పనికి రాననిపిస్తోందని వేదాంత ధోరణిలో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు అంతా అయోమయంగా ఉందని, తాను ఇక రాజకీయాల్లో ఉండకపోవచ్చేమోనని వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాలకంటే ఎంపీ రాయపాటి సాంబశివరావే ముఖ్యమని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో మాణిక్యవరప్రసాద్ టీడీపీలోకి చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనికి మాణిక్యవర ప్రసాద్ రాజకీయ గురువు గుంటూరు పార్లమెంటరీ సభ్యుడు రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. మాణిక్యవరప్రసాద్ వైసీపీలో చేరుతున్నారన్న వార్తలు తనను విస్మయానికి గురి చేశాయని అన్నారు. వెంటనే ఆయనతో మాట్లాడానని.. తామంతా ఒకేచోట ఉంటామని స్పష్టం చేశారు. వరప్రసాద్ని టీడీపీలోకి తీసుకురావాల్సిందిగా సీఎం చంద్రబాబు తనను అడిగారని, ఆయన సేవలు పార్టీకి అవసరంగా సీఎం భావిస్తున్నారని చెప్పారు. టీడీపీలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన నేతల కోరత ఏర్పడిందని, మాణిక్యవరప్రసాద్ చేరికతో మరికొందరు ఎస్సీ నేతలు టీడీపీలో చేరే అవకాశాలు వుంటాయని చంద్రబాబు భావిస్తున్నారని తెలిపారు.
ఇదిలావుండగా, పార్టీ యువనేత నారా లోకేశ్ బాబు డోక్కామాణిక్యవరప్రసాద్ తో ఫోన్ ద్వారా సంభాషించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆయనను తమ పార్టీలో నారా లోకేష్ అహ్వానించినట్లుగా తెలుస్తుంది. రాయపాటికి పార్టీలో లభించినట్లుగానే తనకు కూడా మంచి గౌరవప్రదమైన స్థానాన్ని ఇస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో త్వరలోనే మాణిక్యవరప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more