తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇద్దరు మహిళల్ని కాంగ్రెస్ పార్టీ నియమించింది. అందులో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారద బాధ్యతలు తీసుకున్నారు. ఆ పార్టీ అగ్రనేతల సమక్షంలో గాంధీభవన్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు వాయిలార్ రవి, రామచంద్ర కుంతియా, జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కౌన్సిల్లో మహిళలకు ఏ ఒక్కపార్టీ కూడా సీటు ఇవ్వలేదని, ఒక్క కాంగ్రెస్ పార్టీనే అవకాశం ఇచ్చిందని ఈ సందర్భంగా గులాంనబీ ఆజాద్ అన్నారు.
అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుంకర పద్మశ్రీ భక్త భాద్యతలు తీసుకున్నారు. ఈమెచేత ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రమారణ స్వీకారం చేయించారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా ఏమాత్రం లేదన్న విషయం తెలిసిందే! ఎన్నికల్లో దారుణంగా ఓటమి చవిచూసిన అనంతరం పార్టీ నేతలు కొన్నాళ్లపాటు కనిపించకుండాపోయారు. తమ పార్టీ ఇమేజ్ ని తిరిగి పెంచుకునే పనుల్లో బాగానే పడిపోయారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే మొదటగా ‘మహిళలు’ ఆకర్షించేందుకు ఈ విధంగా మహిళా అధ్యక్షుల్ని ఎన్నుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీలపైనే ఎన్ని విమర్శలు చేసినా ప్రయోజనం లేదని.. అలాకాకుండా సరికొత్త పంథాలో పాదాలు కదిపితే ప్రజలు తిరిగి తమ పార్టీవైపు ఆకర్షితులయ్యే అవకాశం వుందని కాంగ్రెస్ భావించినట్లు కనిపిస్తోంది. అందుకే.. తొలిప్రయత్నంలో ఇద్దరూ మహిళా అధ్యక్షుల్ని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి ఎంతమేరకు ప్రయోజనం తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more