పూర్ణమినాడు కనిపించే చంద్రుడు ఎంతో వెలుగునిస్తాడు. భయంకరమైన చీకటిలో భయపడుతున్నవారికి అభయహస్తంలా నేనున్నాంటూ ప్రకాశిస్తాడు. కానీ.. కారుమబ్బులు అడ్డొస్తే చంద్రుని వెలుగు ఏమాత్రం కనిపించదు. ఈ విధమైన పరిస్థితియే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రాభివృద్ధికోసం, రైతున్నలకు ఆపన్నహస్తం ఇవ్వడంకోసం సీఎం చంద్రబాబు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ.. కేంద్రప్రభుత్వం ఆయనకు సహకరించడం లేదు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా బాబు ముందుకెళుతున్నారు. అటు.. రాష్ట్రంలో విపక్ష పార్టీ వైకాపా సైతం తమ విమర్శలతో ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఆయన చేసే ప్రతి పనిలోనూ కారుమబ్బుల్లాగే అడ్డుపడుతూ ప్రజలను మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ, వైకాపా పార్టీ మధ్య వైరం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు పార్టీల మధ్య పచ్చిగడ్డి భగ్గమనేంత శత్రుత్వం వుంటుంది. ముఖ్యంగా వైకాపా అయితే టీడీపీపై నిత్యం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు మరోసారి వైకాపాధినేత జగన్ మరోసారి చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి రైతులెందరో నాశనమయ్యారని జగన్ విమర్శించారు. వారి తరపున పోరాడవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. రైతుల కష్టాలు తీరుస్తానని ఎన్నికలముందు హామీ ఇచ్చిన బాబు.. ఇప్పటివరకు వారికి చేయూతనిందించలేదని, మాయమాటలు చెప్పి బాబు రైతులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. రైతులు కన్న ఎన్నో ఆశలు బాబు అడియాశలు చేశారని జగన్ పేర్కొన్నారు.
అనంతపురం, కడప జిల్లాల్లో వైఎస్ జగన్ రైతు భరోసాయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగానే ఆయన ఆత్మహత్యలు చేసుకు రైతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ యాత్రలో ఆయన ఓ రైతు గోడు తెలుసుకుంటున్న సందర్భంగా తీసిన ఫొటోను ట్విటర్లో పెట్టారు. ఆ రైతు గురించి వివరిస్తూ ఇలాంటి రైతులను ఆదుకోవాలని జగన్ ట్వీట్ చేశారు. రైతుల ఆశలు పూర్తిగా సన్నగిల్లనివ్వరాదని, వారికి అండగా నిలవాలని ఆయన అబిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more