ఉత్తరప్రదేశ్ తో కులం రక్కసి మరోసారి కాటు వేసింది. అమాయకురాళ్లయిన ఐదుగురు ఆడపడచుల మానాన్ని బజారుపాలు చేసింది. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన షాజహాన్పూర్ జిల్లా హరేవా ప్రాంతంలో చోటుచేసుకుంది. అయిదుగురు దళిత మహిళలను.. గ్రామం నడిబోడ్డు నుంచి సమీపంలోని జాతీయ రహదారి వరకు కులసంఘాల నేతలు నగ్నంగా ఊరేగించారు. ఐదు గంటల పాటు ఈ దారుణ ఘటన జరిగినా.. పోలీసులు మాత్రం అక్కడికి చేరుకోలేదు. ప్రథాని నరేంద్రమోడీ తన విదేశీ పర్యటనలలో ఇప్పడు భారత దేశీయులమంటూ గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయని ప్రకటనలు చేస్తున్న తరుణంలో భారత్ తో కుల రక్కస్సులు, మానభంగాలతో, అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లతో బాసిల్లుతుంది. ఇదే నా మన భారతం అని దిగజారే స్థాయికి పడిపోతోంది.
వివరాల్లోకి వెళ్తే.. తమ అమ్మాయి దళిత యువకుడితో వెళ్లిపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన బీసి వర్గానికి చెందిన గ్రామస్తులు మంగళవారం ఉదయం దళిత మహిళలపై విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ వారిని ఇళ్లల్లోంచి బయటకు లాక్కొచ్చారు. చెప్పులతో కొట్టి అమానించారు.. నట్టనడివీధికి తీసుకొచ్చి ఘోరంగా అవమానించారు. ఒంటిపై ఉన్న దుస్తులను లాగేసి వివస్త్రలను చేశారు. ఆ తర్వాత ప్రధాన రహదారిపై ఊరేగించారు. దాదాపు అయిదు గంటలపాటు ఈ అమానుషకాండ కొనసాగింది. ఇంత జరుగుతున్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు పోలీసులు అటువైపుకు రాలేదు.
ఆలస్యంగా నిద్రలేచిన పోలీసులు.. జరగాల్సిన అమానుష కాండ జరిగిపోయిన తరువాత.. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అమ్మాయి తండ్రితో సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ విచారణకు ఆదేశించారు. మరోవైపు దీనిపై రాజకీయ పార్టీలు స్పందించాయి. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more