కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మెట్టికాయ పడింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ పట్టణ నివాసయోగ్య పథకం (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్) ( ఎన్ యు ఎల్ ఎం) వెనుక పెద్ద కుంభకోణం దాగివుందని అత్యున్నత న్యాయస్థానం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పట్టణ నివాస సముదాయాల (అర్బన్ షెల్టర్ హోం) నిర్మాణం పేరిట వందల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసినా.. ఇళ్ల నిర్మాణంలో జాప్యం ఎలా జరిగిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇళ్ల సముదాయాలను చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు అప్పగించగా, పనులు జరగకపోవడంపై ఆక్షేపించింది.
ఈ ఇళ్ళ నిర్మాణంపై సోషల్ జస్టిస్ బెంచ్ లో దాఖలైన పిటీషన్ను న్యాయమూర్తి మదన్ బి లోకుర్, యు లలిత్లతో కూడి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'రూ.1,078 కోట్ల నిధులను రాష్ట్రాలకు కేటాయిస్తే కేవలం 208 ఇళ్లు నిర్మాణం మాత్రమే జరగడం ఏంటని నిలదీసింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ చూస్తుంటే మొత్తం విషయం అర్థం అవుతోంది. ఇదో పెద్ద కుంభకోణంలా ఉందని వ్యాఖ్యానించింది.
అంతకుముందు పట్టణ పేదలకు షెల్టర్లపై మహారాష్ట్రకు రూ.170 కోట్లివ్వగా, ఒక్కటీ కట్టలేదని, ఉత్తరప్రదేశ్కు రూ.180 కోట్లివ్వగా, 37 షెల్టర్లు కట్టారని కేంద్రం కోర్టుకు తెలిపింది. మొత్తం వ్యవహారంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఏ రాష్ట్రం ఎలా వెచ్చించిందో తెలియజేయాలని, రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more