గత రెండు మూడు తరాలగా కనీవినీ ఎరుగని పెను భీభత్సాన్ని ఇవాళ సంభవించిన భూకంపం సృష్టించడంతో అక్కడి ఫుణ్యక్షేత్రాలను చూసేందుకు వెళ్లని తెలుగువారు ఎలా వున్నరాన్న ఉత్కంఠకు తెరపడింది. నేపాల్ పర్యటనకు వెళ్లి భూకంపంలో చిక్కుకున్న హైదరాబాదీలందరూ సురక్షితంగా ఉన్నారు. సాయిబాబా ట్రావెల్స్ ద్వారా ఖాట్మండ్ వెళ్లిన హైదరాబాద్ రామంతాపూర్కు చెందిన 28 మంది యాత్రికులు ఖాట్మండులో సురక్షితంగా వున్నారన్న విషయాన్ని టూర్ ఆర్గనైజర్ మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నుంచి 25 మంది యాత్రికులు నేపాల్ వెళ్లారు. తామంతా ప్రస్తుతం పశుపతినాథ్ ఆలయానికి సమీపంలో ఉన్నట్లు గౌరీశంకర్ చెప్పారు. ప్రకంపనలు రాగానే అందరం రోడ్డుమీదకు వచ్చేశామని ఆయన అన్నారు. తాము ఏప్రిల్ 17వ తేదీన హైదరాబాద్ నుంచి బయల్దేరామని, కాశీ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఖాట్మాండు వచ్చామని ఆయన వివరించారు.
వీరితో పాటు కాగా, గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి వెళ్లిన వారు మాత్రం సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది. అలాగే హైదరాబాద్ నుంచి బయల్దేరిన 25 మంది కూడా సురక్షితంగా ఉన్నట్టు సమాచారం వచ్చింది. నేపాల్ లోని పెను భూకంపం బారి నుంచి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్నారు. ఖాట్మాండులో 25 వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. రాందేవ్ బాబా ఉన్న వేదిక భూకంపం ప్రభావానికి కుప్పకూలిపోయింది. దాంతో వేదిక మీద ఉన్నవారంతా పడిపోయారు. అయితే.. ఈ ప్రమాదం నుంచి రాందేవ్ బాబా మాత్రం తృటిలో తప్పించుకున్నారు.
కాగా, మరో 125 మంది భారతీయులు ప్రస్తుతం నేపాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుంచి 80 మంది యాత్రికులు నేపాల్ వెల్లారు. వీరిలో 20 మంది పర్వతారోహణ కోసం వెళ్లారు. వీళ్ల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఎవరి ఫోన్లూ పనిచేయకపోవడంతో వీళ్ల విషయమై తీవ్ర ఆందోళన నెలకొంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more