ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్ రెడ్డి ఇవాళ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని పరప్పనా అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన ఏడు కేసులలో ఆరు కేసులకు సంబంధించి ఇప్పటికే పలు న్యాయస్థానాలు బెయిలు మంజూరు చేశాయి. కాగా ప్రధానమైన ఆరోపణలు వున్న ఒబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఈ నెల 20న దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆయన ఇవాళ బెంగుళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు.
గాలి జనార్థన్ రెడ్డి విడుదల అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో జైలు ఆవరణకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆయన అభిమానులు, కొన్ని గంటల నుంచి ఆయన కోసం నిరీక్షించారు. పలువురు కార్యకర్తలు ఆయన పోస్టర్లకు క్షీరాభిషేకం చేశారు. పవిత్రమైన శుక్రవారం రోజున తమ అభిమాన నేత జైలు నుంచి విడుదలవ్వడం శుభసూచకంగా పలువురు అభిమానులు వ్యాఖ్యానించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు వెంటరాగా, గాలి జనార్థన్ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు. అక్కడి నుంచి కొంత దూరం వరకు ర్యాలీగా అభిమానగణంతో కదలివెళ్లారు.
పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా అగ్రహార జైలు వద్ద 144 సెక్షన్ విధించారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి వరకు జైలు అవరణ వద్ద 144 సెక్షన్ అమల్లో వుంటుంది. కాగా 20వ తేదీన బెయిల్ లభించినప్పటికీ సుప్రీం కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్లను పోంది బెంగుళూరు చేరుకున్న అయన తరపు న్యాయవాదులు.. అమావాస్య కారణంగా ఇవాళ జైలు అధికారులకు వాటిని అందించినట్లు సమాచారం. దీంతో గాలి జనార్థన్ రెడ్డి మూడున్నర సంవత్సరాల తరువాత ఎట్టకేలకు స్వేచ్చా’గాలి‘ని పీచ్చుకున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more