సభ్య సమాజం సిగ్గు పడే పని చేసింది మగ మృగాళ్లు.. కానీ శిక్ష పడింది మాత్రం బాధితురాలికి. పెళ్లి చేసుకుందాం అనే తెలుగు చిత్రంలో కథానాయికకు ఎదురైన పరిస్థితినే ఇక్కడా అ అమ్మాయి కూడా ఎదుర్కుంది. అయితే సినిమాలో చూపించిన కథాంశం హిట్ అయినా.. నిజ జీవితంలో మాత్రం ఆ అమ్మాయికి ఎవరు దిక్కు..?ఎవరో చేసిన నేరానికి ఓ అమ్మాయికి తల్లిదండ్రులు శిక్ష వేశారు. పదో తరగతి చదువుతున్న అమ్మాయిపై ఇటీవల ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి అండగా ఉండాల్సిన తల్లిదండ్రులు సమాజానికి భయపడి ఆమెను కాదన్నారు. తమ కూతురి వల్ల కుటుంబం మొత్తం అపఖ్యాతికి గురుకావాల్సి వస్తుందని భయంతో ఆమెను ఇంట్లోకి రానీయలేదు.
కర్ణాటకలోని గుబ్బి తాలుకాలో గల నిట్టోరులో తల్లిదండ్రులతో కలసి నివాసం వుంటున్న ఓ పదో తరగతి విద్యార్థినిపై బాగురు నివాసి, నిట్టూరులో సెల్ ఫోన్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్న మంజునాథ (25) , బాగురు గ్రామానికి చెందిన మంజునాథ (25) దేవరాయపట్నకు నివాసి తుమకూరు కారు ఫైనాన్స్ కంపెనీలో పనిచేపే సునిల్ (26).. మరో నిందితుడు 18 ఏళ్ల బాలుడ కలసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వారని అరెస్టు చేశారు. నిందితులు కూడా వారు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిపారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు చెప్పారు
అయితే జరిగిన విషయాన్ని మర్చిపోవాలని, పోలీసులు, కేసులతో అపఖ్యాతి వద్దని అమ్మాయి తల్లిదండ్రులు అమెను నచ్చజెప్పారు. అయినా నేరస్థులకు శిక్షపడాలని అమ్మాయి పోలీసులకు పిర్యాదు చేయడంతో.. విషయం గ్రామం మొత్తం పాకింది. దీంతో తాము అపఖ్యాతికి గురి కాకూడదని, ఒక అమ్మాయిపై పడిన మచ్చ మరో అమ్మాయికి వ్యాపించకూడదని వారు కన్న కూతరిని ఇంట్లోకి రానీయకుండా తరిమేశారు. దీంతో ప్రస్తుతం బాధితురాలు తుమకూరులోని గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోంలో ఉంటోంది.
నేరానికి యువకులను సవిత అనే తార్పుడుగత్తె ప్రేరేపించినట్లు తెలుస్తోంది. అమ్మాయికి మత్తు మందు కలిపిన జ్యూస్ తాగించి నేరానికి పురికొల్పినట్లు చెబుతున్నారు. ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more