తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలింది. బెంగళూరు కోర్టు.., ఈమేరకు శనివారం తీర్పు వెల్లడించింది. 18ఏళ్ళ క్రితం నమోదయిన కేసులో సుదీర్ఘ విచారణల తర్వాత కోర్టు తీర్పు వెల్లడించింది. జయలలితపై వచ్చిన అక్రమాస్తుల అభియోగాలు వాస్తవమే అని తేల్చింది.
అప్ డేట్స్
మధ్యాహ్నం 1గంట తర్వాత జయలలితకు విధించే శిక్షపై తీర్పు వెల్లడికి అవకాశం
జయలలితపై అక్రమాస్తుల ఆరోపణలు రుజువయినట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
బెంగళూరు కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తతలు, భారీగా చేరుకున్న జయ మద్దతుదారులు
కోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్న పోలిసులు
బెంగళూరు కోర్టు సమీపంలో ఆంక్షలు అమలు చేస్తున్న పోలిసులు
కోర్టులోకి తమిళనాడు మంత్రులను అనుమతించని పోలిసులు
మీడియా, లాయర్ల కోసం ప్రత్యేకంగా ఎన్ క్లోజర్ల ఏర్పాటు
కేసు వివరాలవి
1991-96 మద్య తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు. ఆ సమయంలో దత్తపుత్రుడు సుధాకరన్ పెళ్లి కోసం ఏకంగా రూ. 5కోట్లు ఖర్చు చేశారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. జయ అక్రమంగా ఆస్తులు కూడబెట్టింది కాబట్టే.., ఇలా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోందని విమర్శలు వచ్చాయి. ఆస్తులపై విచారణ జరపాలని సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేశారు. దీనిపై 18సంవత్సరాల పాటు ధర్యాప్తు, విచారణ జరిగింది.
1996 జూన్లో జయలలితపై సుబ్రమణ్యం స్వామి ఫిర్యాదు చేశారు
జయలలితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడాదిపాటు విచారణ జరిపి 1997 జూన్లో ఛార్జిషీటు దాఖలు చేశారు
అక్టోబర్లో జయలలిత, వీకే శశికళ, సుధాకరన్, ఇళవరసిలపై అభియోగాలు నమోదయ్యాయి
2002 నవంబర్ నుంచి 2003 ఫిబ్రవరి వరకు సాక్షులను విచారించారు
విచారణలో పారదర్శకత లేదంటూ 2003 ఫిబ్రవరిలో అన్బుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దాంతో 2003 నవంబర్ నెలలో ఈ కేసు విచారణను బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
2010లో విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారు.
2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఆమె విచారణకు హాజరయ్యారు
2012లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా జి.భవానీసింగ్ నియమితులయ్యారు
దానిపై అన్బుగన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో కర్ణాకట కోర్టు భవానీసింగ్ను తప్పించింది.
తనను తప్పించడంపై భవానీసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
ఈలోపు ప్రత్యేక కోర్టు జడ్జి బాలకృష్ణ పదవీ విరమణ చేశారు.
కొత్త జడ్జిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు.
2014 ఆగస్టులో విచారణ పూర్తయింది.
శనివారం రోజు జడ్జి మైఖేల్ జయలలితను దోషిగా నిర్ధారిస్తూ తీర్పుఇచ్చారు.
కార్తిక్
సంబంధిత వార్తలు:
తమిళనాడు సీఎం జయలలిత భవితవ్యం.. ఏమిటీ..?
ఆమ్మ ఆస్తులపై కోర్టు తీర్పు నేడే..
తమిళనాడులో ఉద్రిక్తలు, పోలీసులు లాఠీచార్జ్..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more