Tense situation in tamilnadu as banglore court found cm jaya guilty

tense situation, tamilnadu, banglore court, CM, jayalalitha, guilty, assets case, kernataka

tense situation in tamilnadu as banglore court found CM jaya guilty

తమిళనాడులో ఉద్రిక్తలు, పోలీసులు లాఠీచార్జ్..

Posted: 09/27/2014 01:45 PM IST
Tense situation in tamilnadu as banglore court found cm jaya guilty

అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా తేల్చిన నేపథ్యంతో ఇటు తమిళనాడు, అటు కర్ణాటక రెండు రాష్ట్రాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదాయానికి మించిన ఆస్తులు వున్నాయని కోర్టు నిర్ధారించింది. తమ అధినేత్రిని దోషిగా నిర్ధరించడంపై ఏఐఏడీఎంకే శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో బెంగళూరు ప్రత్యేక కోర్టు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అన్నాడీఎంకే పార్టీ శ్రణులు కోర్టు తీర్పుతో హతశులయ్యారు.

కోర్టు తీర్పుతో దిగ్ర్భాంతికి గురైన పార్టీ శ్రేణులు తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. అటు తమిళనాడు, కర్ణాటకలోని .హోసూరు ప్రాంతంలో డీఎంకే- అన్నా డీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ కేసులో జయలలితతో పాటు ఆమె ఒకనాటి ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్, ఇలవరసిలను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది.

న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు లక్ష మంది పోలీసు బలగాలను అధికారులు మోహరించారు. పటిష్ఠమైన బందోబస్తు మధ్య బెంగళూరులోని ఓ జైల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుకు  చేరుకన్న తమళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఆగర్భ ప్రత్యర్థి డీఎంకే పన్నిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఇక తీర్పు నేపథ్యంలో డీఎంకే నాయకుడు స్టాలిన్.. తన తండ్రి కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. తీర్పు ఎలా స్పందించాలన్న అంశంపై ఆయన తండ్రితో చర్చించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tense situation  tamilnadu  banglore court  CM  jayalalitha  guilty  assets case  kernataka  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more