ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు వెళ్లి అక్కడ రాం చంద్ కుష్వాహా అంటే ఎవరని అడిగితే ఎవరికీ తెలియదు. అదే 'మియా ముచ్ఛందార్' (తెలుగులో మీసాల రాయుడు) ఎక్కడుంటారంటే.. చిన్న పిల్లలు కూడా దగ్గరుండి మరీ ఆయన ఇంటికి తీసుకెళ్తారు. ఆయనకి అంత పాపులారిటీ తెచ్చిపెట్టింది ఆయన మీసాలే. పాతికేళ్లుగా నిత్యం శ్రమించి మీసాన్ని పెంచారాయన. మీసం పొరపాటున కూడా కట్ చేయకుండా.. ఏకంగా 17 అడుగులు పెంచారు. సుమారుగా మనిషి ఎత్తుకు మూడున్నరింతల పొడవు. నిద్రాహారాలకు కూడా తగినంత సమయాన్ని ఇవ్వని ఈయన.. మీసం కోసం మాత్రం చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు.
40 ఏళ్ల వయసులో ఉండగా ఆయన మీసం కట్ చేసుకోవడం మానేశాడు. అప్పట్లో తనకు తెలిసి ఒక పరిచయస్తుడు అతని మీసంతో 8 అంకె వేసేవాడు. అది చూసి ముచ్చటపడి తానూ పొడవాటి మీసాలు పెంచాలనుకున్నారు. తనకు మీసం పెరిగినా, అలా 8 అంకె మాత్రం వేయలేకపోయానని రాం చంద్ కుష్వాహా బాధపడ్డాడు. ఇంత పోడువున మీసాలు ఎలా పెంచాలో తనకో బాబా నేర్పించారని చెప్పారు. చాలా కాలం నుంచి ఆయన తిండి తినడం కూడా మానేశారు. కేవలం పాలు మాత్రమే తాగి బతికేస్తున్నారు. ఎవరినీ పొరపాటున కూడా తన మీసం ముట్టుకోనివ్వరు.. దాన్ని జాగ్రత్తగా కట్టేసి తన తలపాగా కింద దాచేస్తారు.
ఇంత చేసిన ఆయన ఇప్పటి వరకు ఏ రికార్డల పుస్తకాల్లోకి ఎక్కలేదు. వాటిలో తన పేరును నమోదు చేయాలంటే ఎలాగో చెప్పేవారు లేక ఒక కారణమైతే.. తాను సాధించిన ఘనతను ఎలా చెప్పుకోవాలే తెలియకపోవడం మరో కారణం. కానీ, 17 అడుగుల మీసం ఉన్నందుకు మాత్రం చాలా సంతోషిస్తాడు. ప్రస్తుతం గిన్నెస్ రికార్డుల్లో జైపూర్కు చెందిన రాంసింగ్ చౌహాన్ పేరు మీదే అతిపెద్ద మీసం రికార్డు ఉంది. ఆయన మీసం 14 అడుగుల పొడవుంది. ఇప్పుడు ఎవరైనా గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం కుష్వాహా పేరు గిన్నెస్ రికార్డులలోకి ఎక్కే అవకాశం ఉంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more