కారులో ప్రయాణమంటే ఎవరికి మాత్రం ఇష్టం వుండదు..? అయితే కారు కొనాలంటే వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ అని కొనేవారు అధికంగా వున్నా.. కారు కొని ఏం చేయాలని అడిగే వారు చాలా మంది వుంటారు. ఎందుకని అని అడిగితే.. కారు కొనడం కన్నా దాన్ని నడపడం చాలా కష్టమని భావించే వారి సంఖ్య చాలా ఎక్కువే. నడపడం అంటే మెయిన్ టేన్ చేయడం. అంటే కారులో పెట్రోలుకు బదులు కరెన్సీ కట్టలను పోయాలని వారి భావన. అయితే ఇలాంటి వారికి రెనోల్ట్ కంపెని మంచి ఆఫర్ ని తెచ్చిపెట్టింది.
సాధారణంగా ఏ కారైనా ఎంత మైలేజి ఇస్తుంది.. మహా అయితే 15 నుంచి 20 కిలోమీటర్లు, ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చిన కార్లు 20 నుంచి 28 కిలోమీట్లర్ల మైలేజీని ఇస్తున్నాయి. పెట్రోలు, డీజిల్, సీఎన్జీ, ఎల్పీజీ ఇలా ఏ ఇంధనం వాడినా ఇంతకంటే ఎక్కువ రావడం దాదాపుగా అసాధ్యం. అసలు గట్టిగా మాట్లాడితే బైకులు కూడా 60-80 కిలోమీటర్లకు మించి మైలేజి ఇవ్వవు. అయితే ఏదైనా కారు లీటరు పెట్రోలుకు 100 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందంటే మీరు నమ్మగలరా? నమ్మితీరాల్సిందే అంటోది రెనోల్ట్ సంస్థ. ఎందుకంటే.. తమ సంస్థ కొత్తగా తయారుచేస్తున్న 'ఇయోల్యాబ్' అనే కారు కేవలం ఒక్క లీటరు పెట్రోలు పోస్తే చాలు.. ఎంచక్కా వంద కిలోమీటర్లు పరుగు తీస్తుందట. నమ్మలేని నిజమేనండి. సంస్థ అధికారులు ఈ తరహా కారును రూపోందించారట. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ కారును తొలిసారిగా ప్యారిస్ మోటారు షోలో ప్రదర్శించనున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి.
ఇంధనాన్ని అత్యంత తక్కువగా వినియోగించుకునే కారు రూపొందించాలన్న ఉద్దేశంతో రెనో కంపెనీ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తయారుచేసినట్లు చెబుతున్నారు. కార్లను కేవలం షోరూంలో చూసి, ఫొటోలు చూసి ఆనందించాల్సిన అవసరం ఇక ఏమాత్రం లేదని, తమ కొత్త టెక్నాలజీ సాయంతో కారును సొంతం చేసుకోవచ్చని రెనో కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బి-సెగ్మెంటు కారుగా చెబుతున్న దీని కోసం కొత్తగా 100 కొత్త టెక్నాలజీలు ఉపయోగించారు. దీనికోసం ఏరోడైనమిక్స్ను పూర్తిగా మార్చారు, బరువు తక్కువ పెట్టారు, దానికి తోడు హైబ్రిడ్ టెక్నాలజీ కూడా వాడారు. అంటే ఈ కారు ఇటు పెట్రోలుతోను, అటు కరెంటుతోను కూడా నడుస్తుందన్నమాట. ఇకనేం.. ఈ కారు బుక్ చేసుకుని షికారుకెళ్లాలనుకుంటున్నారా..? ఆల్ ది బెస్ట్
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more