మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి సారి సమైక్యంద్ర జేఏసీ విద్యార్థులతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు సమైక్యంద్ర కోసం పోరాటం చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంద్రకు చెందిన 13 జిల్లాల విద్యార్థులతో సమావేశం అయ్యారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతూ.. ఇప్పుడు విద్యార్థుల సత్తా చాటే సమయం వచ్చిందని ఆయన సీమాంద్ర విద్యార్థులనుద్దేశించి అన్నారు. ముఖ్యమంత్రి పదవి రాజీనామ చేసిన అనంతరం రాజకీయ నేతలతో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్న తురుణంలో విద్యార్థి సంఘాలతో సమావేశం కావటం అందర్ని ఆశ్చర్యపరుస్తుంది.
ఈ సమావేశంలో.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దొడ్డిదారిన రాష్ట్ర విభజన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు తెలుగు వారిని అవమనించారని కిరణ్ కుమార్ రెడ్డి ఆవేశంగా అన్నారు.
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలను అడ్డంపెట్టుకునే కేంద్రం రాష్ట్ర విభజన చేసిందని ఆయన ఆరోపించారు. కేసుల నుండి తప్పించుకోవడానికి ఒకరు, పదవుల కోసం మరొకరు గడ్డి తిన్నారని కిరణ్ ఘాటుగా విమర్శించారు.
తెలుగువారిని అవమానిస్తే మౌనంగా ఉండాలా? మన రాజధానిని తీసుకుని వెళ్ళిపొమ్మంటే పోవాలా? అని కిరణ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్రలు సంక్రాంతికి వెళితే... హైదరాబాద్ ఎడారిలా మారిందని... విభజన అనంతరం అదే పరిస్థితి ఉంటుందని కిరణ్ జోష్యం చెప్పారు.
అసలు కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశా? తెలంగాణనా? అని ప్రశ్నించారు. అందరూ కలిసి ఉన్న రాజధానిని మన నుంచి లాక్కొని, మనల్ని మెడ పెట్టి గెంటేసి తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా ప్రకటించుకున్నారని ఆయన తీవ్ర స్ధాయిలో విమర్శించారు.
తెలుగు వారిని పార్లమెంటులో అవమానిస్తుంటే ఊరుకోవాలా? అని కేంద్రంపై ఆయన విరుచుకుపడ్డారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానంటే , కొన్ని పత్రికలు సోనియాగాంధీనే నా చేత పార్టీ పెట్టిస్తున్నారని దుష్ప్రచారం చేశాయని కిరణ్ పేర్కొన్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more