కేంద్ర మంత్రి జైరాం రమేష్ తిరుపతి పర్యటన నిమిత్తం ఈరోజు ఎయిర్ ఇండియా విమానం రేణిగుంట చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సమైక్య వాదులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. జైరాం గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో రహదారికి అడ్డంగా బైఠాయించారు. ఎంతసేపటికి సమైక్యవాదులు వెనక్కి తగ్గకపోవటంతో.. కేంద్రమంత్రి జైరాం తిరిగి రేణిగుంట విమానాశ్రయంలోపకిలి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద పోలీసులకు, సమైక్యవాదులకు తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించటంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆద్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
పరిస్థితి అదుపుతప్పుతున్న సమయంలో పోలీసు బలగాలు.. సమైక్యవాదులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే సీమాంద్ర మహిళలు కూడా జైరాం వాహనాలకు అడ్డుపడి , సమైక్యవాదులకు మద్దతుగా నిలించారు.
ఎంపీ చింతా మోహన్ కూడా అక్కడికి చేరుకోని, సమైక్యవాదులకు మద్దతు తెలిపారు. అయితే ఒకనోక సమయంలో ఎంపీ చింతా మోహన్ పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది. ఎంపీ రాకతో సమైక్యవాదులు రెచ్చిపోవటంతో రంగంలోకి జిల్లా ఎస్ రాజశేఖర్ బాబు విమానాశ్రయం వద్దకు చేరుకొని కేంద్రమంత్రి జైరాం రమేష్ను ప్రత్యేక కాన్వాయ్ లో తిరుపతి తీసుకెళ్లారు.
జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. సీమాంద్ర అభివ్రుద్దికి బిజేపి ఎలాంటి డిమాండ్ చేయలని ఆయన అన్నారు. సీమాంద్ర అభివ్రుద్ది కట్టుబడి ఉన్నామని అన్నారు. అందుకే విశాఖ నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more