కోలీవుడ్ పై ఐటీ అధికారులు దాడులు చేయటం జరిగింది. ఒకే రోజు సినీ ప్రముఖల ఇళ్లపై దాడులు చేయటంతో కోలీవుడ్ ఉల్కిపడింది. అయితే ఈ దాడులు వెనుక ఉన్న అర్థం ఏమిటో కోలీవుడ్ వర్గాలకు అర్థం కావటంలేదు. గతంలో టాలీవుడ్ సినీ ప్రముఖల ఇళ్ల పై ఒకేసారి ఐటీ దాడులు చేసిన సంచలనం స్రుష్టించిన విషయం తెలిసిందే. ఒకేసారి ఐటీ దాడులు జరగటం వెనుక రాజకీయ హస్తం ఉందని కోలీవుడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. చెన్నైలో ఒకే సమయంలో 29 మంది నిర్మాతలు, నటుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
తెలుగులో పలు చిత్రాలు నిర్మించిన ఏఎమ్ రత్నం, ఆర్ బీ చౌదరి ఇళ్లను ఐటీ అధికారులు తనిఖీ చేశారు. జ్ఞానవేలు రాజా, హాస్య నటుడు సంతానం తదితర ప్రముఖల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. ఒకేసారి ఇంతమంది ప్రముఖల ఇళ్లను సోదా చేయడం గమనార్హం. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సివుంది.
తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇలాంటి దాడులు జరగటం మాములే అని కొంతమంది కోలీవుడ్ పెద్దలు అంటున్నారు. కానీ ఈ దాడులు వెనుక బలమైన రాజకీయ నాయకులు ఉన్నట్లు కోలీవుడ్ ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దాడుల్లో ఐటీ అధికారులకు అనేక విలువైన వస్తువులు, కొంత నగదు, బంగారం దొరికినట్లు సమాచారం. చెన్నైలో జరుగుతున్న ఐటీ దాడులను ద్రుష్టిలో పెట్టుకొని టాలీవుడ్ సినీ పెద్దల కూడా అప్రమత్తం అవుతున్నట్లు సమాచారం.
ఇటీవల కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమిళ చిత్ర పరిశ్రమ పై ద్రుష్టిపెట్టినట్లు సమాచారం. గతంలో నటుడు కమల్ హాసన్ కు ముఖ్యమంత్రి జయలలిత విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. అలాగే నటుడు విజయ్ కూ ‘అన్నా ’ సినిమా విషయంలో జయలలిత ఎంటరైన విషయం తెలిసిందే. రీసెంట్ గా రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా జయలలిత బాధితుడే అనే అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more