కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగటం వాస్తవమే కానీ, విదేశీ పర్యటకుల సంఖ్య గత రెండు నెలలుగా రెండు శాతం పెరిగిందని కేంద్ర పర్యాటక శాఖామాత్యులు చిరంజీవి అన్నారు. అవాంఛనీయమైన సంఘటనలు, విదేశీ పర్యటకుల పట్ల జరిగిన దురదృష్టకరమైన సంఘటనల వలన మనదేశాన్ని సందర్శించే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిపోవచ్చని మీడియాలో కథనాలు వచ్చాయి కానీ, నిజానికి అలాంటిదేమీ జరగలేదు. జనవరి ఫిబ్రవరి నెలల్లో భారతదేశాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య ప్రోత్సాహకరంగా ఉంది కానీ మీడియా భయపడ్డట్టుగా నష్టపోలేదన్నారాయన.
విదేశీ పర్యాటకుల వలన భారతదేశానికి వచ్చిన ఆదాయం భారత దేశ కరెన్సీలో చూసుకుంటే 19.8, అమెరికన్ డాలర్లలో చూస్తే 11.4 శాతం పెరిగిందని కూడా చిరంజీవి వివరించారు.
పోయిన నెలలో 39 సంవత్సరాల స్విస్ యువతి మధ్య ప్రదేశ్ లో సామూహిక అత్యాచారానికి గురైంది. ఆగ్రాలో బ్రిటిష్ యువతి హోటల్ బాల్కనీలోంచి దూకి తననుతాను రక్షించుకునే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలించుకుంది. ఢిల్లీలో బస్ లో వైద్యవిద్యార్థిని మీద ఘాతుకమైన సామూహిక అత్యాచారం దేశ విదేశాలలో సంచలనాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో విదేశీయులు భారత్ లోకి పర్యటనలకు రావటానికి జంకుతారేమోనన్న భయాన్ని పలువురు వెలిబుచ్చారు, దాన్ని మీడియా కూడా సమర్థించింది.
కానీ, భారత దేశ ప్రజల మీద, ప్రభుత్వం మీద, శాంతి భద్రతల సంస్థలమీద ఇంకా నమ్మకం ఉన్న విదేశీ పర్యాటకులు భారతదేశ పర్యటనలను కొనసాగిస్తున్నారు. అందుకు చిరంజీవి కూడా సంతోషాన్ని వ్యక్తం చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more