వరల్డ్ ఛాంపియన్షిప్లో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్గా పీవీ సింధు ఘనత సాధించడంతో ఆమె తల్లి విజయ భావోద్వేగానికి లోనయ్యారు. స్విట్జర్లాండ్లోని బాసెల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్ షట్లర్ ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో వరుస సెట్లలో పీవీ సింధు గెలుపొందిన విషయం తెలిసిందే. 2017, 2018లో వరుసగా ఫైనల్లో ఓడిన పీవీ సింధు.. ఈసారి స్వర్ణం గెలవాలని తాము ఆశించినట్లు చెప్పుకొచ్చిన విజయ.. తన పుట్టిన రోజుకి కూతురు గొప్ప బహుమతి ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారమే విజయ పుట్టినరోజు కావడంతో.. పీవీ సింధు కూడా పసిడి పతకాన్ని తన తల్లికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది.
‘ఈ గొప్ప క్షణాల కోసం మేము సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నాము. పీవీ సింధు పసిడి పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది. నా పుట్టిన రోజుకి గొప్ప బహుమతిని అందించింది’ అని విజయ ఆనందం వ్యక్తం చేశారు. ఫైనల్ మ్యాచ్ తర్వాత పీవీ సింధు మాట్లాడుతూ ‘వరుసగా 2017, 2018 ఫైనల్లో నేను ఓడిపోయా. అందుకే ఈ ఏడాది ఫైనల్లో గెలవడం నాకు చాలా ముఖ్యం. ఇక్కడ నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకి థ్యాంక్స్. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు.. అందుకే ఈ పసిడి పతకాన్ని ఆమెకి అంకితం చేస్తున్నా’ అని ప్రకటించింది.
Am so lucky to capture this moment. #sindhu speaks to her family for the first time after winning the #BadmintonWorldChampionships. #PVSindhu pic.twitter.com/O1DHsnhVYs
— krishnamurthy (@krishna0302) August 25, 2019
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more