‘పీవీ సింధు నువ్వు వరల్డ్ ఛాంపియన్ షిప్ లో ఎందుకు స్వర్ణం గెలవలేకపోతున్నావు..?’ రెండేళ్ల నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్ కి తరచూ ఎదురవుతున్న ప్రశ్న ఇదే. కానీ.. తాజాగా ఆ ప్రశ్నకి తన రాకెట్ పసిడి పతకంతో సమాధానం చెప్పిందని పీవీ సింధు వెల్లడించింది. 2017, 2018లో వరుసగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి చేరిన పీవీ సింధు.. రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో.. అమెకు ఫైనల్ ఫోబియా ఉందంటూ ప్రచారం కూడా జరిగింది. ఇక ఎవరు చూసినా ఫైనల్ లో ఎందుకు తడబడుతున్నావన్న ప్రశ్నలనే సంధిస్తున్నారు.
అయితే సింధూ మాత్రం.. వారి ప్రశ్నలకు బదులివ్వాలని బలంగా అనుకుంది. పట్టుదలతో ఛాంపియన్ షిఫ్ లో అడుగుపెట్టిన సింధూ.. వరుసగా మూడోసారి ఫైనల్ వరకు చేరకుంది. హ్యాట్రిక్ ఫైనల్ లోకి చేరుకున్న ఆమె.. ఈ సారి ఎలాంటి తడబాటు లేకుండా.. స్వర్ణపతక సాధనే లక్ష్యంగా బరిలోకి అడుగుపెట్టింది. జపాన్ షట్లర్ ఒకుహరాపై గెలిచి ఎట్టకేలకి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ టోర్నీ చరిత్రలో ఓ భారత షట్లర్ బంగారు పతకం గెలవడం ఇదే తొలిసారి.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అధికారిక వెబ్ సైట్ తో పీవీ సింధు మాట్లాడుతూ ‘గత రెండేళ్లుగా పసిడి పతకం గురించి నన్ను ప్రశ్నించిన వారికి ఇదే సమాధానం. నా రాకెట్తో విజయం సాధించి వారికి సమాధానం చెప్పాలని ఆశించా. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. గత రెండు పర్యాయాలు ఫైనల్లో ఓడిపోవడం చాలా బాధ, కోపం తెప్పించాయి. అందుకే.. తాజా ఫైనల్లో అన్ని భావోద్వేగాల నడుమ పోటీపడ్డాను. చాలా మంది.. ఎందుకు ఆ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోతున్నావ్..? అని ప్రశ్నించారు. దీంతో.. ఫైనల్కి ముందు నా గేమ్.. నేను ఆడాలని గట్టిగా నిర్ణయించుకున్నా.. అలానే ఆడాను.. గెలిచాను’ అని వెల్లడించింది.
వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ కి ఇప్పటి వరకూ 10 పతకాలు లభించగా.. ఇందులో పీవీ సింధు మాత్రమే ఐదు పతకాలు గెలిచింది. 2013లో కాంస్యం పతకం గెలిచిన సింధు.. 2014లో మరోసారి కాంస్యానికే పరిమితమైంది. ఆ తర్వాత 2017, 2018లో వరుసగా రజతాలను గెలిచినా.. కొద్దిలో స్వర్ణాలను చేజార్చుకుంది. ఇక ఈ సారి అన్ని భావోద్వేగాల నడుమ పోటీపడ్డానని చెప్పిన సింధూ.. స్వర్ణ పతకాన్ని అందుకుని.. ఈ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కూడా చరిత్రపుటల్లోకి ఎక్కింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more