Finance cheating visakhapatnam

finance cheating visakhapatnam

finance cheating visakhapatnam

finance cheating visakhapatnam.png

Posted: 03/06/2013 09:16 PM IST
Finance cheating visakhapatnam

‘సిమ్స్’ తరహా మోసం మరొకటి వెలుగుచూసింది. అధిక వడ్డీ ఎరచూపి సామాన్య, మధ్య తరగతి వేతన జీవులను నట్టేట ముంచేశారో జంట.  దువ్వాడ జోన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సం బంధించిన వివరాలు ఇలావున్నాయి. పరవాడకు చెందిన నారోతో మమత, వీరమళ్ల ఉదయ్‌భాస్కర్ దంపతులు అగనంపూడిలో నివాసముంటున్నారు. ఉదయ్‌భాస్కర్ రాంకీ ఫార్మాసిటిలోని ఫార్మాజెల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. దంపతులిద్దరూ కూర్మన్నపాలెంలో ‘రాజరాజేశ్వరి షేర్స్ అండ్ కమోడిటీస్ ఆన్‌లైన్ ట్రేడింగ్’ పేరుతో బంగారు, వెండి ఆన్‌లైన్ ట్రేడింగ్‌ను ప్రారంభించారు. వ్యాపారం లో అనూహ్య లాభాలు వస్తున్నాయని నమ్మబలికారు. పెట్టుబడి పెడితే కనీసం 7 రూపా యలు వడ్డీ చెల్లిస్తామని ఫార్మాజెల్ ఉద్యోగులను ఆకర్షించారు. దీంతో ఈ కంపెనీతోపాటు వివిధ కంపెనీలకు చెందిన ఉద్యోగులు పెద్ద మొత్తం వీరిలో చేతిలో పెట్టారు. చివరికి నష్టాల్లో మునిగిపోయామంటూ చేతులెత్తేశారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో అగనంపూడి నుంచి శ్రీహరిపురం సమీపంలోని గొల్లలపాలేనికి మకాం మార్చేశారు. వడ్డీమాటుంచితే అసలు కూడా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుండడం, మ కాం మార్చేడంతో బాధితులు పోలీ సులకు ఫిర్యాదు చేశారు. సీఐ టి.త్రినాథ్ సారధ్యంలో ఎస్‌ఐ సన్యాసిరావు కేసు నమోదుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Diarrhea spreads in agency areas
Sims projects director arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more