హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితులు రోజుకోరకంగా మారుతున్నాయి. ఒకపక్క పోలీసులు కంటి మీద కునుకు లేకుండా గల్లీల్లో గస్తీ తిరుగుతున్నప్పటికీ ఎక్కడో ఒక చోట అలజడి రేగుతూనే ఉంది. చార్మినార్ వద్ద కొద్దిరోజుల క్రితం జరిగిన అల్లర్లలో నిందితులను గుర్తించే పనిలో ఉండగా అల్లరి మూకలు మరోసారి విధ్వంసం సృష్టించాయి. శాంతిభద్రతలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు పాతబస్తీలోని నాలుగు పోలీస్స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. అయిన ప్పటికీ ఉద్రికత్తలు చల్లారడం లేదు. ఈ పరిస్థితులు ఏ పరిణామాలకు దారి తీస్తాయోనని ప్రజలు భయాందోళ న చెందుతున్నారు.
ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలను కొన్ని అల్లరిమూకలు సదా వకాశంగా మలుచుకుంటున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చార్మినార్ వద్దకు రాకపోకలను అనుమతించడంతో సాధారణ పరిస్థితులు వచ్చాయని భావిస్తున్న కొద్ది గంటలకే అల్లరిమూకలు రెచ్చిపోయాయి. హైకోర్టుకు కూతవేటు దూరంలో ఉన్న ఝాన్సీ బజార్లో ఆరు కార్లను, రెండు ద్విచక్ర వాహనాలకు దుండగులు అర్ధరాత్రి నిప్పు పెట్టారు. చేలాపురా గొల్లగల్లిలో ఇళ్ల ముందు నిలిపిన కార్లపై పెట్రోలు పోసి నిప్పటించారు. తర్వాత ద్విచక్ర వాహనాలను దహనం చేశారు. ఆ దారిలో వెళ్తూ మంటలను గమనించిన కొందరు ఆయా యజమానులను నిద్రలేపారు. అప్పటికే వాహనాలు చాలా వరకు కా లిపోయాయి. బాధితులు ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిర్మానుష్యంగా ఉన్న రహదారి అందులోనూ సరైన విద్యుత్ వెలుగులు లేవని భావించిన దుండగులు రెచ్చిపోయి కొన్ని అడుగుల దూరంలో ఉన్న వాహనాలకు నిప్పటించారు. అయితే ఆయా ఇళ్ల ముందు సీసీ కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. పాతబస్తీలో లోగడ జరిగిన పరిణామాలను దృ ష్టిలో ఉంచుకుని కొందరు ఇళ్ల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. వాహనాలకు నిప్పు పెట్టిన తర్వాత నిందితులు పైకి ఎగురుతూ కేరింతలు కొట్టారని తెలిసింది. మంటలు వెలుగు వారిపై పడడంతో కెమెరాల్లో నిందితుల రూపాలు స్పష్టంగా రికార్డు అయ్యాయని విశ్వసనీయ సమాచారం.
అయితే, ఈ కేసులకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చార్మినార్ పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారం గా ఇప్పటి వరకు 12 మంది దుండగులను అరెస్టు చేశారని తెలియవచ్చింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more