Telugu Jokes
మర్సిడీజ్ ఎక్కడి నుంచి వచ్చింది...

ఒకనాడు ఒక అత్త తన ముగ్గురు అల్లుళ్లు తనను ఎంతగా అభిమానిస్తున్నారో తెలుసుకోవడానికి ఒక పన్నాగం పన్నుతుంది. 

అందుకు ఆమె ఒక బావిలో దూకుతుంది. మొదటి అల్లుడు ఆమెను బయటికి తీసుకొస్తాడు. అప్పుడు అత్త తమ అభిమానాన్ని మెచ్చకొని ఒక కార్ కొనిస్తుంది. 

రెండోరోజు కూడా అలాగే బావిలో దూకుతుంది. అది గమనించిన రెండవ అల్లుడు కూడా ఆమెను కాపాడుతాడు. దాంతో అతనికి ఒక మోటార్ సైకిల్ కొనిస్తుంది అత్తమ్మ. 

మూడోరోజు కూడా అత్త అలాగే బావిలో దూకేస్తుంది. కానీ మూడవ అల్లుడు మాత్రం ఆమెను కాపాడడు. అత్త చనిపోతుంది. కానీ నాలుగవరోజు అతనికోసం ఒక మర్సిడీజ్ గిఫ్ట్ గా వస్తుంది... 

ఎక్కడినుంచి వచ్చిందనుకుంటున్నారు.............

అతని మామాగారు ఇచ్చారు.