తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో 6,300 కిలోల భారీ లడ్డూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గోదావరి పుష్కరఘాట్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ భారీ లడ్డూని ఏర్పాటు చేశారు. పర్వదినం సందర్భంగా ఉద యం 11 గంటలకు ఈ లడ్డూను తాపేశ్వరం నుంచి లారీలో తీసుకువచ్చి రెండు క్రేన్ల సహాయంతో లడ్డూని పుష్కరఘాట్ వినాయక విగ్రహం పక్కన పె ట్టారు. లడ్డూని చూసేందుకు నగరవాసులు బారులు తీరారు. తాపేశ్వరం భక్తాంజనేయ స్వీట్స్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఈ లడ్డూ తయారుచేయించారు. ప్రత్యేకమైన ఇనుపరేకులతో బౌల్ తయారుచేయించి ఈ లడ్డూని అందులో పెట్టారు. కేవలం 9 గంటల వ్యవధిలో ఈ లడ్డూ తయారు చేసినట్లు భక్తాంజనేయ స్వీట్స్ అధినేత చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్ర కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు మళ్లీ జోరందుకున్నాయి. ముఖ్యమంత్రిని మార్చితే తప్ప కాంగ్రెస్ గాడిలో పడదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహతో మంత్రుల జానారెడ్డి, సారయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి, సీనియర్ నాయకులు... Read more
Sep 20 | మన రాష్ట్రగవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన, పలువురు నేతలతో జరుపుతున్న భేటీలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటి అయ్యారు.... Read more
Sep 20 | కావేరీ జల వివాదం మళ్లీ ముదురుతున్నది. జలాల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అధ్యక్షతన జరిగిన కావేరీ ట్రిబ్యునల్ సమావేశం విఫలమైంది. కావేరీ నుంచి తమిళనాడుకు అక్టోబర్ 15 వరకు రోజూ 9వేల... Read more
Sep 20 | ఇతడు సూపర్ మ్యాన్కే బాబులాంటి వాడు. ఎందుకంటే.. సూపర్ మ్యాన్ డ్రస్సు మీద ఒకే అండర్వేర్ వేసుకుంటే.. ఇతడు ఏకంగా 302 అండర్వేర్లు వేసుకున్నాడు! బ్రిటన్లోని విట్బర్న్కు చెందిన గ్యారీ క్రెయిగ్(53) సౌత్ షీల్డ్స్లో... Read more
Sep 20 | స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలన్న బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు తిరస్కరించింది. ప్రతినిధుల సభ ముందుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేసింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 98 మంది ఎంపీలు ఓటేయగా అనుకూలంగా 42... Read more